News April 9, 2025

సీతారాముల వారి కళ్యాణానికి పటిష్ట బందోబస్తు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 11న శుక్రవారం నిర్వహించనున్న సీతారాముల వారి కళ్యాణం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పేర్కొన్నారు. 2 వేలకు మంది పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు విధుల్లో నలుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డీఎస్పీలు, 73 మంది సీఐలు, 177 మంది ఎస్ఐలు, 1700 మంది పోలీసు సిబ్బంది ఉంటారన్నారు.

Similar News

News November 28, 2025

ప్రొద్దుటూరులో 10 మంది విద్యార్థులకు అస్వస్థత

image

ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం తినడం వల్ల 10 మంది విద్యార్థులు తీవ్ర అస్తస్వతుకు గురయ్యారు. వడ్డించిన పప్పు దుర్వాసన వస్తుందని, బాగాలేదని మొదట తిన్న కొంత మంది విద్యార్థులు చెప్పడంతో ఆ పప్పును వడ్డించకుండా పక్కన పెట్టేశారు. కొద్దిసేపటికి ఆ 10 మందికి కడుపునొప్పి, వాంతులు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు ఆటోలో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News November 28, 2025

అమీన్ పీర్ దర్గాలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ టీమ్ సందడి

image

కడప పెద్ద దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర బృందం శుక్రవారం దర్శించుకుంది. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, నిర్మాత రాహుల్, డైరెక్టర్ సాయిల్, విక్రమ్, చైతన్య తదితరులు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

News November 28, 2025

కడప: రైతు కంట నీరు.. నష్టం నమోదుకు అడ్డంకులు

image

జిల్లాలో నాలుగు రోజుల కింట కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు అంటున్నారు. చేలల్లోనే ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అధికారులు నమోదు చేయడం లేదని వాపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇంకా తమకు లాగిన్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారంటున్నారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.