News April 6, 2025

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన జాన్ వెస్లీ

image

మధురైలో జరుగుతున్న సీపీఎం 24వ జాతీయ మహాసభల్లో అమరచింత వాసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నేడు చివరి రోజు జరిగిన జాతీయ మహాసభలో కేంద్ర నాయకత్వం జాన్ వెస్లీకి కేంద్ర కమిటీలో స్థానం కల్పించింది. జాన్ వెస్లీ కేంద్ర కమిటీకి ఎన్నికైన నేపథ్యంలో అమరచింత సీపీఎం నాయకులు గోపి, బుచ్చన్న, అజయ్, వెంకటేశ్, రమేష్, శ్యాంసుందర్ జాన్ వెస్లీకి అభినందనలు తెలిపారు.

Similar News

News September 18, 2025

చిన్నమండెం: గుండెపోటుతో టీచర్ మృతి

image

చిన్నమండెం మండలం చాకిబండ తెలుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బీవీ శ్రీధర్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలో చనిపోయారు. ఆయన మృతి పట్ల మండల వ్యాప్తంగా ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.

News September 18, 2025

కర్నూలు మార్కెట్ యార్డుకు నేడు, రేపు సెలవు

image

కర్నూలు మార్కెట్ యార్డుకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ బి.నవ్య తెలిపారు. మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఉల్లిని ట్రేడింగ్, బహిరంగ వేలం ద్వారా బయటకు తరలించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇవాళ, రేపు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

News September 18, 2025

తిరుపతి: DSC అభ్యర్థులకు గమనిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో DSCకి ఎంపికైన అభ్యర్థులందరికీ CM చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో ఉద్యోగాలకు ఎంపికన వారంతా రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు ఇవాళ ఉదయం 7గంటలకు చేరుకోవాలని DEO కేవీఎన్ కుమార్ కోరారు. ఫొటో, ఆధార్, కాల్ లెటర్‌తో వస్తే వారిని బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.