News March 17, 2025

సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన క్రైమ్స్ డీసీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన క్రైమ్స్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన బి.జనార్దన్ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలుసి మొక్కను అందజేశారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీల నియంత్రణకై తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలు, అలాగే పెండింగ్ ఉన్న చోరీ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు నిందితులను పట్టుకోవడం కోసం పోలీస్ కమిషనర్ క్రైమ్ డీసీపీ పలు సూచనలు చేశారు.

Similar News

News March 18, 2025

NLG: టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO

image

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీవరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 105 రెగ్యులర్ కేంద్రాలను, 3 ప్రైవేట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18,666 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

News March 18, 2025

టీడీపీ, జనసేనతో కలిస్తే మాకే నష్టం: బీజేపీ ఎమ్మెల్యే

image

తెలంగాణలోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి కూటమిగా పోటీ చేస్తాయని జరుగుతున్న ప్రచారంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలతో కలిసి పోటీ చేస్తే తమ పార్టీకే నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సొంతంగా ఎదుగుతున్న సమయంలో ఇతర పార్టీలతో పొత్తు సరికాదన్నారు. కొన్ని అంశాలపై ప్రాంతీయ, జాతీయ పార్టీల వైఖరుల మధ్య తేడాలుంటాయని పేర్కొన్నారు.

News March 18, 2025

IPL మ్యాచ్: HYDలో భారీ బందోబస్తు

image

IPL అభిమానులకు అసౌకర్యం కలగకుండా క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. ఉప్పల్ స్టేడియంలో IPL నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల గురించి డీసీపీలు, ఏసీపీలు, హైదరాబాద్ క్రికెట్ ప్రతినిధులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. స్టేడియం చుట్టూ 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉప్పల్‌ పరిసరాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఉంటుంది.

error: Content is protected !!