News February 5, 2025
సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 20, 2025
విశాఖ-చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు

దీపావళి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు రద్దీనీ దృష్టిలో ఉంచుకొని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక రైలు నడపనుంది.అక్టోబర్21న సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుండి చర్లపల్లి(08541)మధ్య ప్రత్యేక రైలు బయల్దేరి,అక్టోబర్22ఉదయం 8గంటలకు చేరుతుంది.అలాగే అక్టోబర్ 22న మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి -విశాఖ(08542)మధ్య ప్రత్యేక రైలు బయల్దేరి, అక్టోబర్23న ఉదయం7 గంటలకు విశాఖపట్నం చేరుతుందని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.
News October 20, 2025
అమలాపురం: నేడు ఎస్పీ పీజీఆర్ఎస్ రద్దు

అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని దీపావళి సందర్భంగా సోమవారం (20వ తేదీ) రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి పండుగను ప్రమాదాలకు తావు లేకుండా, ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.
News October 20, 2025
24 నుంచి బిహార్లో మోదీ ఎన్నికల ప్రచారం

ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి బిహార్లో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు ఆ రాష్ట్ర BJP వర్గాలు తెలిపాయి. 24న సమస్తీపూర్, బెగుసరాయ్లో జరిగే రెండు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని చెప్పాయి. తిరిగి 30న రెండు సభలకు హాజరవుతారని పేర్కొన్నాయి. నవంబర్ 2, 3, 6, 7వ తేదీల్లోనూ మోదీ ర్యాలీలు ఉంటాయని వివరించాయి. బిహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.