News February 5, 2025
సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 19, 2026
KMR: ప్రజావాణికి 75 దరఖాస్తులు

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 75 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలపై కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. వినతులను స్వీకరించిన ఆయన, వాటిని వెంటనే సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
News January 19, 2026
ఏలూరు: ఆయన సోషల్ మీడియా MLA

ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రజా సమస్యలు తెలుసుకోవడం కంటే సోషల్ మీడియా ప్రచారానికే పెద్దపీట వేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అదృశ్యం కేసులో పోలీసులు స్పందించి ఆచూకీ కనుగొంటే, ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకున్నారని చర్చ సాగుతోంది. ప్రజల మధ్యకు రాకుండా లైకులు, కామెంట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శిస్తున్నారు.
News January 19, 2026
కర్నూలు కలెక్టరేట్లో 270 ప్రజా ఫిర్యాదుల స్వీకరణ

కర్నూలు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)కు మొత్తం 270 అర్జీలు అందినట్లు డీఆర్వో వెంకట నారాయణమ్మ వెల్లడించారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 167 అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన ఈ అర్జీలను ఆయా శాఖల వారీగా వర్గీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు.


