News March 16, 2025

సీసీటీవీ ఇన్స్‌టాలేషన్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

సీసీటీవీ ఇన్స్‌టాలేషన్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. బుక్కపట్నంలోని డిగ్రీ కళాశాలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చదివిన వారు ఈ కోర్సులు నేర్చుకోవడానికి అర్హులు అన్నారు. ఆసక్తి కలవారు దరఖాస్తులు చేసుకోవాలని, మూడు నెలల శిక్షణానంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 18, 2025

అత్యాచారం కేసులో 10 ఏళ్ల శిక్ష

image

66 ఏళ్ల వృద్ధురాలిపై 2018లో జరిగిన అత్యాచారం కేసులో శ్రీ సత్యసాయి జిల్లా మదిగుబ్బకు చెందిన 55ఏళ్ల పెద్దన్నకు అనంతపురం నాలుగో సెషన్స్ కోర్టు 10 ఏళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధించింది. కేసు విచారణలో 11 మంది సాక్షుల వాదనలు పరిశీలించిన అనంతరం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి హరిత తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు.

News October 18, 2025

ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు(శనివారం) జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశామని ఓయూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని సూచించారు.

News October 18, 2025

వరంగల్: ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయింపు

image

ఉమ్మడి WGL జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు భూపాలపల్లి జిల్లాల్లో ఉన్న ఆర్టీసీ బస్సు డిపోల ఎదుట బీసీ జేఏసీ నాయకులు బైఠాయించారు. బస్సులు బయటకు పోకుండా ఆర్టీసీ డిపో ముందు కూర్చుని ఆందోళన చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుండగా, ప్రైవేటు పాఠశాలలు వాణిజ్య వ్యాపారులు మద్దతిచారు.