News March 22, 2025

సీసీ రోడ్ల నిర్మాణంలో కర్నూలు జిల్లా నం.1: పవన్ కళ్యాణ్

image

సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఓర్వకల్లు మం. పూడిచెర్ల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తెలిపారు. జిల్లాలో రూ.75 కోట్లతో 117 కి.మీ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో 98% రోడ్ల నిర్మాణం పూర్తయిందని, దీనికి కలెక్టర్ రంజిత్ బాషాకు అభినందనలు తెలిపారు. అందుకే పూడిచెర్లలో నీటి కుంటల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

Similar News

News December 21, 2025

కొండగట్టుకు మరోసారి రానున్న పవన్ కళ్యాణ్..?

image

ప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మరోసారి వస్తున్నట్లు సమాచారం. శనివారం TTD ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు కొండగట్టులో దీక్షా మండపం, 96 విశ్రాంత గదుల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. త్వరలోనే ముహూర్తం ఖరారు చేసి, శంకుస్థాపన నిర్వహిస్తామన్నారు. అయితే, ఈ శంకుస్థాపనకు పవన్ కళ్యాణ్ వస్తారని TTD అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

News December 21, 2025

నేటి నుంచి పల్స్ పోలియో..1,707 కేంద్రాలు సిద్దం: కలెక్టర్

image

ఏలూరు జిల్లాలో ఈనెల 21 నుంచి 23 వరకు నిర్వహించే పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఐదేళ్లలోపున్న 2.04 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయడమే లక్ష్యంగా 1,707 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.49 లక్షలు, పట్టణాల్లో 29 వేలు, గిరిజన ప్రాంతాల్లో 20 వేల మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించామని, తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు.

News December 21, 2025

‘అగ్నాస్త్రం’ తయారీ విధానం, వినియోగం

image

పొగాకు, వేపాకు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లిని మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి 10 లీటర్ల ఆవు మూత్రం కలపాలి. దీన్ని పొయ్యి మీద 5 పొంగులు వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పొయ్యి మీద నుంచి దించి గుడ్డ/గన్నీ సంచితో కప్పాలి. 48 గంటలు చల్లారాక వడగట్టి భద్రపరుచుకోవాలి. అవసరమైన సమయంలో ఎకరానికి 100 లీటర్ల నీటిలో 2 లేదా రెండున్నర లీటర్ల అగ్నాస్త్రం కలిపి పంటలపై పిచికారీ చేయాలి. ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుంది.