News February 5, 2025
సీ వ్యూ పాయింట్ పనులను పరిశీలించిన కలెక్టర్

తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ బుధవారం పిచ్చాటూరు మండలంలో పర్యటించారు. పిచ్చాటూరు సమీపంలోని ఆరణీయార్ ప్రాజెక్టు వద్ద నిర్మితమవుతున్న టూరిజం సీ వ్యూ పాయింట్ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఇరిగేషన్ అధికారులు, మండల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 16, 2025
ఉద్యోగుల కోసం రేపు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం: VZM కలెక్టర్

ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా సకాలంలో హాజరు కావాలని కోరారు.
News October 16, 2025
BHPL: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు!

ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ ఖరేలు అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని ఇందిరమ్మ ప్రభుత్వ కాంట్రాక్టు నిర్మాణాలకు కావాల్సిన ఇసుకరవాణాపై నేడు రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పితే ఎంతటి వారిపైనైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. క్వారీలలో
అక్రమాలు లేకుండా చూడాలన్నారు.
News October 16, 2025
బిగ్బాస్ షోను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

TG: బిగ్బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. బిగ్బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్బాస్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరించారు.