News April 3, 2025
సుంకేసుల డ్యామ్ ఘటన.. మృతులు వీరే!

కర్నూలు జిల్లా సుంకేసుల డ్యామ్ వద్ద నిన్న విషాద ఘటన జరిగిన విషయం తెలిసిందే. నగరానికి చెందిన సులేమాన్ (47) తన కుమార్తెకు పదో తరగతి పరీక్షలు ముగియడంతో కుటుంబ సభ్యులతో కలిసి డ్యామ్ వద్దకు వెళ్లారు. తన కుమారులు ఫర్హాన్ (13), ఫైజాన్ (9)తో కలిసి ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో గల్లంతయ్యారు. కాసేపటి తర్వాత మృతదేహాలు బయటపడ్డాయి. ఘటనపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 11, 2025
PHOTO GALLERY: కులవృత్తుల వారికి పనిముట్లు అందించిన సీఎం

AP: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి(మ) వడ్లమానులో వివిధ కులవృత్తుల వారితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. వారికి పనిముట్లు, ప్రోత్సాహకాలు అందించారు. కాసేపు సెలూన్ షాపులో కూర్చుని ముచ్చటించారు. పశువులకు మేత తినిపించారు. టీడీపీకి మొదటినుంచీ బీసీలే వెన్నెముక అని అన్నారు.
News April 11, 2025
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

వారాంతంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. టారిఫ్స్ను 90 రోజులు నిలిపివేయాలన్న ట్రంప్ నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 1,310 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 429 పాయింట్లు వృద్ధి సాధించింది. టాటా స్టీల్, పవర్ గ్రిడ్, NTPC, M&M, రిలయన్స్, కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్సెర్వ్, భారతీ ఎయిర్టెల్, HDFC బ్యాంక్ షేర్లు భారీ లాభాలు సాధించాయి.
News April 11, 2025
సమాన హక్కులకు కృషి చేసిన మహనీయుడు ఫూలే: మెదక్ ఎస్పీ

కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్దరణ, సమాన హక్కులకు కృషి చేసిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫూలే జయంతి సందర్బంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన చేసిన కృషిని కొనియాడారు. సిబ్బంది పాల్గొన్నారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.