News July 26, 2024

సుంకేసుల నుంచి 2,095 క్యూసెక్కుల నీరు విడుదల

image

కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో.. రాజోలి శివారులో ఉన్న సుంకేసుల జలాశయం అధికారులు గురువారం ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేశారు. ఎలాంటి ఇన్ ఫ్లో నమోదు కానప్పటికీ, రెండు గేట్ల ద్వారా దిగువకు 2,095 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లుగా జేఈ రాజు తెలిపారు. డ్యాం మొత్తం నీటిమట్టం 292.00 మీటర్లు ఉండగా, ప్రస్తుతం 290.90 మీటర్లుగా నమోదైనట్లుగా ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 16, 2025

MBNR: విద్యుత్ స్తంభం ఇలాగే ఉండాలా..?

image

మహబూబ్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీలో ఓ ఇంటి ప్రహరీ గోడలో విద్యుత్ స్తంభం దర్శనమిస్తుంది. రెండు నెలల క్రితం ప్రచార మాధ్యమాలలో విషయం వైరల్ కావడంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. నేటికీ అది అలాగే ఉండడంతో స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రహదారి పక్కన ఉండాల్సిన విద్యుత్ స్తంభం ఇంటి ప్రహరీ గోడలోనే ఉండాలా..? అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

News September 15, 2025

MBNR: భరోసా కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ

image

ఎస్పీ డి.జానకి సోమవారం మహబూబ్‌నగర్‌లోని భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె షీ టీమ్, ఏహెచ్‌టీయూ, కళాబృందం, భరోసా కేంద్రం సభ్యులతో సమావేశం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులకు వేధింపులు జరగకుండా కృషి చేయాలని, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.

News September 15, 2025

MBNR: ప్రజావాణికి 15 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి 15 వినతిపత్రాలను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ తెలిపారు.