News June 27, 2024
సుండుపల్లె: పింఛానదిలో పడి బాలుడి మృతి

సుండుపల్లె పింఛా ప్రాజెక్టు నదిలో ప్రమాదవశాత్తూ పడి యశ్వంత్ నాయక్(15)విద్యార్థి మృతి చెందినట్లు ఎస్సై హుస్సేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు పింఛాకు చెందిన మునె నాయక్ కుమారుడు యశ్వంత్ బుధవారం పింఛానదిలో స్నానం చేసేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయి మృతి చెందాడు. పోలీసులు గురువారం మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
Similar News
News November 5, 2025
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

ప్రొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
News November 5, 2025
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

ప్రొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
News November 5, 2025
ప్రొద్దుటూరు: 8 మంది క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులపై కేసు నమోదు

ప్రొద్దుటూరు పోలీసులు బెట్టింగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపుతున్నారు. తన బ్యాంక్ అకౌంట్లను బెట్టింగ్లకు ఉపయోగించారని జగన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో ప్రొద్దుటూరుకు చెందిన వీర శంకర్, చెన్న కృష్ణ, నరేంద్ర, మేరువ హరి, సుధీర్ కుమార్ రెడ్డి, కృష్ణా రెడ్డి, రవితేజ, పోరుమామిళ్ళ (M) నాయునిపల్లెకు చెందిన చంద్ర ఉన్నారు. ఈ కేసును 2 టౌన్ CI సదాశివయ్య దర్యాప్తు చేస్తున్నారు.


