News April 7, 2025

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుగు ప్రయాణం

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన సంజీవ్ ఖన్యా తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు జ్ఞాపికలను అందజేసి వీడ్కోలు పలికారు. పర్యటనకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News April 17, 2025

 సంగారెడ్డి: ‘రెవెన్యూ పారదర్శకతకు సీఎం ప్రత్యేక కృషి’

image

రెవెన్యూ శాఖ పారదర్శకత కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో భూభారతి అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పటివరకు కలెక్టరేట్ చుట్టూ రైతులు తిరిగేవారని, ఈ చట్టంతో అక్కడికక్కడే పరిష్కారం అవుతాయని చెప్పారు. కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాదురి పాల్గొన్నారు.

News April 17, 2025

రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ రమేశ్

image

డార్జిలింగ్‌లో రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం కమిటీ ఛైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన గురువారం జరిగింది. స్టడీ టూర్‌లో భాగంగా సమావేశం నిర్వహించినట్లు రమేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైల్వే ప్రాజెక్టుల ప్రగతిపై సమీక్షించినట్లు తెలిపారు. రైల్వే పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించినట్లు వివరించారు. స్టాండింగ్ కమిటీ సభ్యులతో పాటు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News April 17, 2025

శ్రీసత్యసాయి: స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

image

మున్సిపాలిటీలతోపాటు అన్ని మండల కేంద్రాలలో మూడవ శనివారం చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం పై కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఈఓఆర్డీలతో కలెక్టర్ గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో 13 శాఖలు భాగస్వామ్యం కావాలన్నారు.

error: Content is protected !!