News September 7, 2024

సుభాన్‌ను అభినందించిన అసదుద్దీన్ ఓవైసీ

image

ఖమ్మం ప్రకాష్ నగర్ మున్నేరు వంతెనపై ఇటీవల జరిగిన వరదల్లో చిక్కుకున్న 9 మంది ప్రాణాలు సుభాన్ జేసీబీ సహాయంతో కాపాడిన విషయం తెలిసిందే. శనివారం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ధైర్యసాహసాలను మెచ్చుకొని అభినందించారు. అతనికి రూ.51,000 నగదు ఇచ్చి సత్కరించారు. ఖమ్మంలో డబల్ బెడ్రూమ్ కోసం సీఎం రేవంత్ రెడ్డికి సిఫార్సు చేశారు.

Similar News

News October 28, 2025

తుఫాన్లలోనూ ఆగని విద్యుత్.. భూగర్భ కేబుల్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన

image

మధిర పట్టణంలో విద్యుత్ రంగాన్ని ఆధునీకరించేందుకు రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. భారీ వర్షాలు, తుఫాన్ల సమయంలో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయడమే లక్ష్యమన్నారు. మొత్తం 3.5 కి.మీ 33 కేవీ, 17.3 కి.మీ 11 కేవీ, 15 కి.మీ ఎల్‌టీ లైన్లను భూగర్భంలో వేయనున్నట్లు తెలిపారు.

News October 28, 2025

రాయపట్నంలో సబ్‌స్టేషన్‌కు Dy.CM భట్టి శంకుస్థాపన

image

మధిర మండలం రాయపట్నం గ్రామంలో 33/11 కేవీ నూతన విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, వోల్టేజీ సమస్యల పరిష్కారం, పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి సేవలు అందించడానికి ఈ ఉపకేంద్రం దోహదపడుతుందని తెలిపారు.

News October 28, 2025

డిప్లొమా దరఖాస్తు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్ శంకర్

image

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల దరఖాస్తు గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. రెండేళ్ల కాల వ్యవధి గల ఈ కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయన్నారు. బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tspmb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.