News March 30, 2024
సుల్తానాబాద్: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి సూసైడ్
పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసకున్నాడు. వివరాళ్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ శాస్త్రీనగర్కు చెందిన పల్స శివసాయి(22) కారు నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. కారు నిర్వహణ కోసం 3 నెలల క్రితం ఓ వ్యక్తి వద్ద రూ.70వేలు అప్పు చేశాడు. ఈనెల 27న అప్పు ఇచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి అప్పు తీర్చాలంటూ కారు తీసుకెళ్లాడు. మనస్తాపం చెందిన తను పురుగు మందు తాగాడు. MGMకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.
Similar News
News October 5, 2024
కాటారం:అరుదైన అటవీ జంతువును తరలిస్తున్న ముఠా పట్టివేత?
అటవీ జంతువుల్లో అరుదుగా లభించే ‘అలుగు’ను తరలిస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం మేరకు అలుగును తరలిస్తున్న ముఠాను కాటారం మండలం మేడిపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయసమాచారం. ఈముఠాలో కాటారం సబ్ డివిజన్కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు, మరో ఇద్దరూ ఉన్నట్లు తెలిసింది. కాగా సదరు అలుగు విలువ రూ. 70లక్షల నుంచి రూ.కోటి పైనే ఉంటుందని సమాచారం.
News October 4, 2024
లక్కీ డ్రా నిర్వాహకులపై కేసు నమోదు: చందుర్తి CI
బహమతుల ఆశ చూపెడుతూ లక్కీ డ్రాలు నిర్వహిస్తున్న నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేకుండా దుర్గమ్మ విగ్రహాల వద్ద లయన్స్ యూత్ వారు లక్కీ డ్రా నిర్వహిస్తున్నారన్నారు. ప్రజల వద్ద నుంచి ఒక్కొక్క లక్కీ డ్రా టికెట్ రూ.99 వసూలు చేస్తూ డ్రాలో పాల్గొనాలని ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
News October 4, 2024
MLC ఓటర్ నమోదుపై రాజకీయ నాయకులతో సమావేశం
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై కరీంనగర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీఓ మహేశ్వర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితాపై సలహాలు, సూచనలు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.