News February 26, 2025

సుల్తానాబాద్ : ప్రేమ పేరుతో వేధించిన యువకుడికి జైలు

image

సుల్తానాబాద్ మండలంలోని పూసాలకు చెందిన యువకుడికి జైలుశిక్ష పడింది. మియాపూర్ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో ఇబ్బందికి గురిచేశాడని బాధితురాలు తండ్రికి తెలపడంతో అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదుచేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువైనందున కోర్టు నెలరోజులు జైలుశిక్ష, రూ.1000 జరిమానా విధించింది.

Similar News

News December 8, 2025

MDK: నాడు భర్త సర్పంచ్.. నేడు భార్య ఏకగ్రీవ సర్పంచ్

image

టేక్మాల్ మండలం చల్లపల్లిలో ఎల్లంపల్లి సంగీతను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామానికి చెందిన ఎల్లంపల్లి గోపాల్ 2018 సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి 11 ఓట్లతో గెలిచాడు. 5 ఏళ్లు గోపాల్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించిన గ్రామ ప్రజలు అతని భార్య ఎల్లంపల్లి సంగీతను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో నామినేషన్ వేయించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

News December 8, 2025

ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(SCR) నేటి నుంచి 8 ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి – యెలహంక, యెలహంక – చర్లపల్లి, చర్లపల్లి – షాలిమార్, షాలిమార్ – చర్లపల్లి మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అలాగే HYD – కొట్టాయం, కొట్టాయం – HYD, చర్లపల్లి – H.నిజాముద్దీన్, H.నిజాముద్దీన్ – చర్లపల్లి మధ్య రైళ్లు నడుస్తాయని SCR తెలిపింది. రైళ్ల స్టాపులు తదితర వివరాలను పై ఫొటోల్లో చూడొచ్చు.

News December 8, 2025

పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

image

2026 మార్చి-ఏప్రిల్‌లో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు చెల్లించే ఫీజు తేదీల గడువును పెంచినట్లు DEO క్రిష్టప్ప
ఆదివారం తెలిపారు. అన్ని పాఠశాలల యాజమాన్యం గమనించాలని కోరారు. ఎలాంటి అపరాద రుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125లు, ఒకేషనల్ విద్యార్థులు ఫీజుతో పాటు అదనంగా రూ.60లు, తక్కువ వయస్సు కోసం రూ.300లు చెల్లించాన్నారు.