News April 9, 2024
సుల్తానాబాద్: మల్లన్న స్వామి పట్నాలలో ఎమ్మెల్యే

సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి పట్నాల మహోత్సవ వేడుకలను నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల మహోత్సవ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మంగళవారం సాయంత్రం పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక బోనం చెల్లించి మొక్కులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులు సన్మానం చేశారు.
Similar News
News November 26, 2025
KNR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వుందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.
News November 26, 2025
KNR: రేపు దివ్యాంగులకు ఆటల పోటీలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 27న (గురువారం) కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కేటగిరీల్లో జరిగే ఈ పోటీలకు దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డులతో హాజరు కావాలని, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.
News November 26, 2025
KNR: రేపు దివ్యాంగులకు ఆటల పోటీలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 27న (గురువారం) కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కేటగిరీల్లో జరిగే ఈ పోటీలకు దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డులతో హాజరు కావాలని, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.


