News February 10, 2025

సుల్తానాబాద్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

సుల్తానాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందాడు. మృతదేహం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ రామగుండం మార్చురీలో ఉందని ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి.తిరుపతి తెలిపారు. వివరాలు తెలిస్తే 9949304574, 8712658604 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.

Similar News

News December 1, 2025

జిల్లాలో మండలాలవారీగా సర్పంచ్ నామినేషన్లు

image

సిరిసిల్ల జిల్లాలో ఆమోదం పొందిన నామినేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
1. రుద్రంగి మండలం గ్రామాలు 10- 32 నామినేషన్లు
2. చందుర్తి మండలం గ్రామాలు 19- 86 నామినేషన్లు
3. వేములవాడ అర్బన్ మండలం గ్రామాలు 11- 51 నామినేషన్లు
4. వేములవాడ రూరల్ మండలం గ్రామాలు 17- 74 నామినేషన్లు
5. కోనరావుపేట మండలం గ్రామాలు 28- 142 నామినేషన్లు
* మొత్తం 85 స్థానాలు
* ఆమోదం పొందిన నామినేషన్లు 385

News December 1, 2025

సిరిసిల్ల జిల్లాలో తొలిదశ నామినేషన్లు 385

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. 85 గ్రామాల సర్పంచ్ స్థానాలకు 539 నామినేషన్లు దాఖలు కాగా 385 నామినేషన్లను ఆమోదించారు. డబుల్ నామినేషన్ల కారణంగా మిగతా వాటిని తిరస్కరించారు. 748 వార్డులకు 1,696 నామినేషన్లు రాగా, సక్రమంగా లేని కారణంగా ఐదు నామినేషన్లను తిరస్కరించారు. డబుల్ నామినేషన్లు పోగా 1,624 నామినేషన్లను ఫైనల్ చేశారు.

News December 1, 2025

WGL: పంచాయతీల బకాయిలు రూ.99.68 కోట్లు.?

image

మాజీ సర్పంచులు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు కోరగా, ఉమ్మడి WGL జిల్లాలో మాజీ సర్పంచులకు రూ.79.68 కోట్లు, ప్రత్యేకాధికారుల పాలనలో కార్యదర్శులు చేసిన ఖర్చులు రూ.20 కోట్లు ఉండవచ్చని అంచనా. మొత్తం బకాయిలు రూ.99.68 కోట్లకు చేరే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.