News March 27, 2024
సువిధ యాప్లో దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్
ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించే రాజకీయ నాయకులు తప్పకుండా సువిధ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పార్టీ అభ్యర్థులు సమావేశాలు మొదలైనవాటిని నిర్వహించడానికి 48గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పోలింగ్ ముగియడానికి 48గంటల ముందు నిశ్శబ్ద కాలం తప్పక పాటించాలని, దీనినే ఎన్నికల ముందు నిశ్శబ్దం అని పిలుస్తారని అన్నారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై ప.గో. జిల్లాలో టెన్షన్
ఢిల్లీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ రేగుతోంది. అయితే ఢిల్లీ ఎన్నికల సెగ జిల్లాను సైతం సాగుతోంది. ఢిల్లీలో నేడు వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా పందేలు సాగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ, ఆప్ మధ్య పోరు జరుగుతుండగా ఇక్కడి పందెం రాయుళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తుది ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యేసరికి పెద్ద ఎత్తున నగదు చేతులు మారనుంది.
News February 8, 2025
JRG: 8వ తరగతి బాలికపై అత్యాచారం
జంగారెడ్డిగూడెం(M) ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI జబీర్ తెలిపారు. SI వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 5న ఇంటికి వెళ్తుండగా శ్యామ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బాలిక కుటుంబీకులకు విషయం చెప్పడంతో వారు నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.
News February 8, 2025
నరసాపురం: ఉత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
నరసాపురంలోని మాధవాయిపాలెం – సఖినేటిపల్లి రేవును శుక్రవారం ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు పూర్తయ్యేంతవరకు ప్రణాళికా బద్ధంగా పనిచేస్తూ, కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. భక్తులు పోలీస్ వారి సూచనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎస్పీ తెలిపారు.