News April 10, 2025

సుస్థిర అభివృద్ధిలో ఎల్లారెడ్డిపేటకి 22వ ర్యాంకు

image

ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ 79.37 మార్కులతో రాష్ట్రంలో 22వ ర్యాంకు సాధించింది. అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీలలో మౌలిక వసతుల పెంపు కోసం, ప్రజల సౌకర్యాలు కల్పన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తాను పనిచేసే ఎల్లారెడ్డిపేట రాష్ట్రంలో 22వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

Similar News

News November 24, 2025

బిడ్డ ఆరోగ్యానికి పునాది అక్కడే..

image

తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడే పేగుల్లో మంచి బ్యాక్టీరియాతో కూడిన ‘మైక్రో బయోమ్‌’ పెరగడం ఆరంభమవుతుంది. గర్భిణి ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే ఈ ‘గట్‌ మైక్రోబయోమ్‌’ తల్లి నుంచి శిశువుకు వస్తుంది. మనం పుట్టినప్పుడు ఉండే మైక్రోబయోమ్‌ స్థితి బట్టి.. మన జీవితం ఎంత సాఫీగా, ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్పొచ్చంటున్నారు నిపుణులు. ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితుల వల్ల మైక్రో బయోమ్‌ మారి రకరకాల వ్యాధులు వస్తుంటాయి.

News November 24, 2025

ఉయ్యాలవాడకు వైఎస్ జగన్ నివాళి

image

​ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటు చేసి బ్రిటీష్ వ్యతిరేక పోరాటానికి నాంది పలికిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఆయన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని కొనియాడారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి నరసింహారెడ్డి పేరు పెట్టడం మనందరికీ గర్వకారణమని జగన్ పేర్కొన్నారు.

News November 24, 2025

హైదరాబాద్ మెట్రో రైల్.. పర్మిషన్ ప్లీజ్

image

నగరంలో రోజూ లక్షలాదిమందిని మెట్రో ట్రైన్ వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ఈ సేవలను మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశను ప్రతిపాదిస్తూ DPR( డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ను కేంద్రానికి పంపింది. గత సంవత్సరం నవంబర్లో ఒకటి, ఈ సంవత్సరం జూన్లో మరో ప్రతిపాదన అందజేసింది. 163 కిలోమీటర్ల వరకు మెట్రోను విస్తరిస్తామని  పేర్కొంది. అయితే ఇంతవరకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.