News April 10, 2025

సుస్థిర అభివృద్ధిలో ఎల్లారెడ్డిపేటకి 22వ ర్యాంకు

image

ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ 79.37 మార్కులతో రాష్ట్రంలో 22వ ర్యాంకు సాధించింది. అభివృద్ధిలో ముందు వరుసలో నిలిచింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ.. పంచాయతీలలో మౌలిక వసతుల పెంపు కోసం, ప్రజల సౌకర్యాలు కల్పన కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో తాను పనిచేసే ఎల్లారెడ్డిపేట రాష్ట్రంలో 22వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందన్నారు.

Similar News

News November 7, 2025

విడుదలకు సిద్ధమవుతున్న వరి రకాలు

image

☛ M.T.U.1282: దీని పంటకాలం 120-125 రోజులు. మధ్యస్త సన్నగింజ రకం. చేనుపై పడిపోదు, అగ్గి తెగులును తట్టుకుంటుంది. గింజ రాలిక తక్కువ. దిగుబడి ఎకరాకు 2.8-3టన్నులు.
☛ M.T.U.1290: పంటకాలం 117-120 రోజులు. సన్నగింజ రకం. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. చౌడునేలలకు అత్యంత అనుకూలం. సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు నేలల్లో ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఎగుమతులకు అనుకూలం.

News November 7, 2025

నారాయణపేట కలెక్టరేట్‌లో సామూహిక ‘వందేమాతరం’

image

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా శుక్రవారం నారాయణపేట కలెక్టరేట్ వద్ద సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్ పాల్గొన్నారు. వందేమాతరం గేయం పవిత్ర గీతం అని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

News November 7, 2025

అమరావతి సిగలో మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ కంప్యూటర్

image

ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ అమరావతిలో భారీ క్వాంటమ్ కంప్యూటర్‌(1,200 క్యూబిట్ సామర్థ్యం)ను ఏర్పాటు చేయనుంది. రూ.1,772 కోట్ల పెట్టుబడికి సంస్థ సిద్ధమవుతోంది. ఇందుకోసం 4వేల చ.అ. విస్తీర్ణంలో భవనం అవసరముంటుంది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే IBM 133 క్యూబిట్, జపాన్‌కు చెందిన ఫుజిసు 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.