News April 2, 2025
సూర్యపేట: ప్రతి బుధవారం పోలీస్ శాఖ ప్రజా భరోసా

గ్రామాల్లో శాంతి భద్రతలు పటిష్టం చేసి ప్రజలకు ప్రశాంతమైన జీవనం గడిపేందుకు పోలీస్ శాఖ ప్రజా భరోసా కార్యక్రమాన్ని ప్రతి బుధవారం నిర్వహిస్తుందని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో గుర్తించిన సమస్యాత్మక గ్రామాల్లో ప్రతి బుధవారం సమావేశం నిర్వహించి సమస్యలు సృష్టించే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు.
Similar News
News November 26, 2025
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

సీఎం చంద్రబాబు నాయుడు వచ్చేనెల 1న ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లను SP ప్రతాప్ శివ కిషోర్ బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ఏలూరు DSP శ్రావణ్ కుమార్తో కలిసి హెలిపాడ్ ప్రాంతం, పార్కింగ్ ప్రాంతాలు, సభా ప్రాంతం, పర్యటనా ప్రాంతాలను పరిశీలించారు.
News November 26, 2025
తుఫాను ముప్పు తప్పింది.. అల్పపీడనం దూసుకొస్తోంది

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన సెన్యార్ తుఫాను ఇండోనేషియా వైపు పయనిస్తోంది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పిందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపారు. ఇది క్రమంగా వాయుగుండంగా బలపడి ఈ నెల 29న తమిళనాడు వద్ద తీరం దాటుతుందని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
News November 26, 2025
కదిరిలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

కదిరి టౌన్లోని రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ షెడ్ పక్కన చింతచెట్ల కింద ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని స్థానికులు అంటున్నారు. అతని ఒంటిపై తెలుపు రంగు టీషర్టు, నలుపు రంగు ప్యాంటు ఉంది. మృతుడికి సుమారు 35 ఏళ్ల వయసు ఉంటుందని పేర్కొన్నారు. వివరాలు తెలిసినవారు 94407 96851కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కదిరి టౌన్ సీఐ నారాయణరెడ్డి తెలిపారు.


