News February 10, 2025

సూర్యాపేటలో మహిళతో సహజీవనం.. కుమార్తెలపై అత్యాచారం 

image

సూర్యాపేటలో ప్రభుత్వ టీచర్ ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెలపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాలిలా.. మామిళ్లగడ్డ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న అతను భార్యతో దూరంగా ఉంటూ 2018 నుంచి మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అతని కన్ను ఆమె కుమార్తెలపై పడింది. వారికి మత్తు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఓసారి మహిళ చూసి ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశారు.

Similar News

News October 26, 2025

రేపు ఎస్పీ మీకోసం కార్యక్రమం రద్దు

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో 27న నిర్వహించవలసిన PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు వంకలు దాటే సమయంలో జాగ్రత్త వహించాలన్నారు.

News October 26, 2025

దూసుకొస్తున్న తుఫాను.. 20 జిల్లాల్లో సెలవులు

image

AP: ‘మొంథా’ తుఫాను రాష్ట్ర తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అనంతపురం, సత్యసాయి, నంద్యాల, KNL, తిరుపతి, SKL జిల్లాల్లో హాలిడేస్ ఇవ్వలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. తీవ్ర ప్రభావం చూపే కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు హాలిడే ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులిచ్చారు.

News October 26, 2025

‘TET నుంచి మినహాయింపు ఇవ్వాలి’

image

సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ కేవల్ కిషన్ భవన్‌లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న 5 డిఏలను వెంటనే ప్రకటించాలని, పిఆర్సి 2023 జూలై నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు