News March 5, 2025
సూర్యాపేట: అంగన్ వాడీ కేంద్రాల్లో కొలువులు

సూర్యాపేట జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు (ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్ వాడీ టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 61 టీచర్ పోస్టులు, 191 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Similar News
News December 16, 2025
VJA: విద్యుత్ బస్సులపై సీఎంతో భేటీ.. వర్కౌట్ అయ్యేనా.?

రాష్ట్రానికి DEC నాటికి రావాల్సిన 750 ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో కేంద్ర నిధులు అందలేదు. ప్రైవేట్ సంస్థ కొనుగోలుకు సిద్ధమైనా, ఛార్జింగ్ స్టేషన్లు, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల అవసరం ఉంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు పాత AC బస్సుల స్థానంలో వీటిని తేవాలనే కేంద్రం సూచనల మేరకు RTC ఉన్నత అధికారులు నేడు CMతో సమావేశం కానున్నారు. ఈ బస్సులను అందుబాటులోకి తెచ్చే అంశంపై కీలక చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
News December 16, 2025
దేశంలో తగ్గిన నిరుద్యోగ రేటు

నవంబర్ నెలలో దేశ నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గి 4.7 శాతానికి చేరుకుంది. అక్టోబర్లో ఇది 5.2%గా ఉండగా తాజా గణాంకాల్లో 8 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి, పట్టణాల్లో 6.5 శాతానికి తగ్గింది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మహిళల భాగస్వామ్యం పెరగడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు.
News December 16, 2025
బాపట్ల: 3 ఏళ్ల నిరీక్షణకు.. నేటితో తెర..!

కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2022 నవంబర్లో విడుదలై నేటికీ దాదాపు 3 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం కోర్టు కేసులు పరిష్కరించి అర్హత గల కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నేడు మంగళగిరిలోని జరిగే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే బాపట్ల జిల్లా అభ్యర్థులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బస్సుల్లో మంగళగిరి చేరుకున్నారు.


