News March 4, 2025
సూర్యాపేట: అరుణాచల గిరి ప్రదక్షిణకు కోదాడ డిపో బస్సులు

తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం కోదాడ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు కోదాడ డిపో మేనేజర్ శ్రీహర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సు ఈనెల 11వ తేదీ సాయంత్రం 7గంటలకు కోదాడ నుంచి బయలుదేరి 12వ తేదీ ఉదయం కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ్నుంచి వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని రాత్రికి అరుణాచలం, 13న పౌర్ణమి గిరిప్రదక్షణ ఉంటుందని తెలిపారు.
Similar News
News October 31, 2025
నరసరావుపేట కలెక్టరేట్లో సర్దార్ పటేల్ జయంతి

స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్ కృత్తికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి జాతీయ ఐక్యతకు పునాది వేసిన వ్యక్తి వల్లభాయ్ పటేల్ అని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
News October 31, 2025
HYD సంస్థానం గురించి తెలుసా?

ప్రపంచప్రఖ్యాత HYD సంస్థానాన్ని 16 జిల్లాలుగా విభజించారు. తెలంగాణ 8, మరాఠ 5, కన్నడ 3 జిల్లాలుగా విస్తరించారు. అనేక రాజవంశాల పాలనలో సుసంపన్నమైన ఈ సంస్థానాన్ని 1724లో మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్దిఖీ అసఫ్జాహీ వంశాన్ని స్థాపించి 224 ఏళ్లు పరిపాలించారు. కాలక్రమంలో వీరి అరాచకాలు ఢిల్లీకి చేరాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలగాలతో ఇక్కడికి వచ్చి సంస్థానాన్ని భారతమాత ఒడిలో విలీనం చేశారు.
News October 31, 2025
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <


