News January 31, 2025
సూర్యాపేట: ఆటో బోల్తా.. ఎనిమిది మందికిపైగా గాయాలు

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలైన ఘటన చివ్వెంల మండలంలో గురువారం సాయంత్రం జరిగింది. బాధితుల వివరాలిలా.. కూలీలు మిరప తోట నుంచి ఆటోలో ఇళ్లకు వస్తుండగా లక్ష్మీనాయక్ తండా వద్ద కుక్క అడ్డువచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం బోల్తా పడింది. ఆటోలో 15 మందికి పైగా కూలీలు ఉండగా, ఎనిమిది మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News November 17, 2025
కోదాడ: ‘ప్రతి రంగంలోనూ మహిళల అద్భుత ప్రతిభ’

మానవ వికాసంలో మహిళల శ్రమ పెద్ద విప్లవం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు డి. స్వరూప అన్నారు. కోదాడలో ఆదివారం నిర్వహించిన సూర్యాపేట జిల్లా రాజకీయ శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడారు. గణ సమాజం నుంచి నేటి అంతరిక్ష పరిశోధనల వరకు ప్రతి రంగంలోనూ స్త్రీలు అద్భుత ప్రతిభ చూపారని కొనియాడారు. అయితే సమాజం మారుతున్న క్రమంలో స్త్రీని అణగదొక్కారని విమర్శించారు.
News November 17, 2025
‘మైథాలజీ’తో మ్యాజిక్.. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా!

పురాణాలు, ఇతిహాసాలను లింక్ చేస్తూ టాలీవుడ్లో తెరకెక్కుతున్న సినిమాలు సూపర్ సక్సెస్ అందుకుంటున్నాయి. పురాణ పురుషుల కథలతో వచ్చిన కల్కి(మహాభారతం), హనుమాన్(రామాయణం), కార్తికేయ-2(శ్రీకృష్ణుడు), మిరాయ్(అశోకుడు, శ్రీరాముడు) వంటి చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాయి. రాజమౌళి-మహేశ్ బాబు కాంబోలోని ‘వారణాసి’, చిరంజీవి-వశిష్ట మూవీ ‘విశ్వంభర’ ఈ కోవలోనివే కావడం గమనార్హం.
News November 17, 2025
బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ‘బ్లూ బుక్’: మోదీ

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఇంజినీర్లు తమ అనుభవాలను ఎప్పటికప్పుడు రికార్డు చేయాలని PM మోదీ సూచించారు. తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు నుంచి నేర్చుకున్న విషయాలను ‘బ్లూ బుక్’లా సంకలనం చేయాలని చెప్పారు. ఏం చేశారనేదే కాకుండా ఒక్కో నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయం భవిష్యత్ టీమ్స్కు తెలుస్తుందని తెలిపారు. సూరత్లోని రైల్వే కారిడార్లో ఇంజినీర్లు, కార్మికులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.


