News January 31, 2025
సూర్యాపేట: ఆటో బోల్తా.. ఎనిమిది మందికిపైగా గాయాలు

రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలైన ఘటన చివ్వెంల మండలంలో గురువారం సాయంత్రం జరిగింది. బాధితుల వివరాలిలా.. కూలీలు మిరప తోట నుంచి ఆటోలో ఇళ్లకు వస్తుండగా లక్ష్మీనాయక్ తండా వద్ద కుక్క అడ్డువచ్చింది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో వాహనం బోల్తా పడింది. ఆటోలో 15 మందికి పైగా కూలీలు ఉండగా, ఎనిమిది మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. వారిని సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News December 2, 2025
వివాహానికి నిజమైన అర్థం అదే: జయా బచ్చన్

ప్రస్తుతం ఉన్న జనరేషన్కు పెళ్లి గురించి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ బాలీవుడ్ నటి జయా బచ్చన్ అన్నారు. ‘నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో మనల్ని మించిపోయారు. అలాగే పెళ్లంటే ఇలానే ఉండాలి అని చెప్పడానికి సరైన నిర్వచనాలు లేవు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలంతే’ అని జయ తెలిపారు.
News December 2, 2025
పాలమూరు: నామినేషన్ అభ్యర్థుల చూపు పంచాంగాల వైపు..!

పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే ఆశావహులు నామినేషన్ల దాఖలు కోసం జాతకాలు, ముహూర్తాలు చూస్తున్నారు. ముహూర్తాలు చూడడం అనేది, లోకంలో మంచి-చెడు, తగిన-తగని అంశాలు ఉన్నట్లే.. ఆచారాలు పాటించడంలో ఇదొక అవసరమైన భాగంగా భావిస్తున్నారు. అందుకే శుభ ముహూర్తంలో నామినేషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు.
News December 2, 2025
ఆ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు: కేంద్రమంత్రి

<<18445876>>సంచార్ సాథీ యాప్పై<<>> కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఆ యాప్ కంపల్సరీ ఏమీ కాదని, ఫోన్లో నుంచి డిలీట్ చేసుకోవచ్చని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ యాప్తో పౌరుల గోప్యతపై ప్రభుత్వం నిఘా పెట్టిందని ప్రతిపక్షాలు, పలువురు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. దీంతో సింధియా స్పష్టతనిచ్చారు.


