News March 9, 2025

సూర్యాపేట: ఆ 8 మంది సజీవ సమాధి..?

image

నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Similar News

News October 15, 2025

విజయ్ ఆలస్యమే తొక్కిసలాటకు కారణం: స్టాలిన్

image

కరూర్ సభకు టీవీకే చీఫ్ విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు కారణమని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ ఘటనపై ఇవాళ అసెంబ్లీలో చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ర్యాలీకి వచ్చినవారికి టీవీకే పార్టీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదని సీఎం ఆరోపించారు. అటు ప్రజలను అదుపు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్ష నేత పళనిస్వామి విమర్శించారు.

News October 15, 2025

Way2News కథనంతో RO ప్లాంటుకు మోక్షం

image

ఇంకొల్లులోని ప్రభుత్వ బీసీ హాస్టల్ వద్ద టాయిలెట్‌లో అమర్చిన RO ప్లాంటు నుంచి వచ్చే తాగునీటి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై ‘<<18006504>>టాయిలెట్‌లో ఆర్వో ప్లాంట్<<>>.. ఇదేం చోద్యం..!’ శీర్షికన మంగళవారం Way2News కథనాన్ని ప్రచురించింది. స్పందించిన అధికారులు బుధవారం ఆ ప్లాంట్‌ను అక్కడి నుంచి తొలగించి వేరే రూమ్‌కు మార్చారు. సమస్యను పరిష్కరించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News October 15, 2025

కేరళలో కెన్యా మాజీ ప్రధాని మృతి

image

కేరళ(కొచ్చి)లోని ఆయుర్వేద కంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెన్యా మాజీ PM రైలా ఒడింగా(80) గుండెపోటుతో మరణించారు. ఉదయం ఆసుపత్రి ఆవరణలో వాకింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా ఉ.9.52కు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఒడింగా మృతిపై FRROకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. 2008-13 కాలంలో ఆయన కెన్యా PMగా వ్యవహరించారు.