News March 4, 2025

సూర్యాపేట: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఈనెల 5 నుంచి 25 వరకు జరగనున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తేజస్వి నందలాల్ పవార్ సోమవారం తెలిపారు. జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలలో ఉ.9 గంటల నుంచి మ.12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఒక గంట ముందే చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్లు అనుమతిలేదన్నారు.

Similar News

News March 4, 2025

అకౌంట్లోకి రూ.15,000.. కీలక ప్రకటన

image

AP: ‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, బడ్జెట్‌లో రూ.9407 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కాగా ఈ పథకం కింద 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం రూ.15,000 జమ చేయనుంది.

News March 4, 2025

VKB: స్పోర్ట్స్‌ స్కూల్‌లో దరఖాస్తుల ఆహ్వానం

image

వికారాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి వాటర్ స్పోర్ట్స్ అకాడమిలో కాయకింగ్, కెనోయింగ్, ఫెన్సింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ నందు గిరిజన బాలబాలికల నుంచి అడ్మిషన్లు కోరుతున్నామని ఆ శాఖ జిల్లా అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. 5వ తగరతిలో బాలురు10, బాలికలకు 10 సీట్లు ఉండగా, మిగతా 6,7,8 తరగతిలో మిగిలిన సీట్లకు ఈ నెల 9 వరకు కలెక్టరేట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News March 4, 2025

అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

image

పాల్వంచ వర్తక సంఘ భవనం పక్కన రేగా లక్ష్మి-రవీందర్ దంపతులు గతేడాది నుంచి నివాసముంటున్నారు. భార్యపై అనుమానంతో గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!