News March 9, 2025

సూర్యాపేట: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News November 22, 2025

అచ్చంపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ఈనెల 17న నారాయణపేట జిల్లా కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఈనెల 19న చనిపోయినట్లు అచ్చంపేట ఎస్సై సద్దాం హుస్సేన్ తెలిపారు. అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా తనది అచ్చంపేట ప్రాంతమని చెప్పినట్లు ఆయన తెలిపారు. చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీలో ఉందని ఇతనిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.

News November 22, 2025

GDనెల్లూరులో తారస్థాయికి వర్గపోరు..?

image

GDనెల్లూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరుకుంది. MLA థామస్, భీమనేని చిట్టిబాబు మధ్య అంతర్గత విభేదాలు కార్యకర్తలకు, నాయకులకు మధ్య చిచ్చు రాజేస్తోంది. భీమినేని చిట్టిబాబు జిల్లా అధ్యక్షుని పదవి రేసులో ఉన్నారు. దీనిని థామస్ అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారట. థామస్ కుటుంబ సభ్యుల్లో కొందరు ఆయనకు వ్యతిరేకంగా, చిట్టిబాబు వెంట నడుస్తున్నట్లు సమాచారం. ఇది ఎటు వెళుతుందో చూడాలి మరి.

News November 22, 2025

JNTU హైదరాబాద్‌కు అధికారిక గీతం విడుదల

image

దేశంలోని మొట్టమొదటి సాంకేతిక విశ్వవిద్యాలయమైన JNTU హైదరాబాద్‌కు ఇప్పుడు అధికారిక గీతం లభించింది. గీతాన్ని యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, గేయరచయిత డా. భూత్కూరి రాజేష్ ఖన్నా రచించగా, సంగీత దర్శకుడు యశోకృష్ణ స్వరపరిచారు. వీసీ టి.కిషన్‌కుమార్ రెడ్డి ఆలోచనతో ఇది రూపుదిద్దుకుంది. జేఎన్టీయూ గేయం విశ్వవిద్యాలయ గౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తోంది అని డా.రాజేష్ ఖన్నా అభిప్రాయపడ్డారు.