News March 9, 2025

సూర్యాపేట: ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఫైనల్..!

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కెతావత్ శంకర్ నాయక్ పేరు ఖరారు చేస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టీ కోటాలో ఆయన పేరును ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, శంకర్ నాయక్‌కు మిర్యాలగూడ, హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ గిరిజన తండాల్లో పట్టుంది. జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఇతర ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News April 17, 2026

కేసీఆర్ సభకు దీటుగా మేడిగడ్డలో CM బహిరంగ సభ..?

image

జగిత్యాల KCR సభకు కౌంటర్ ఎటాక్‌గా, BRS సభకు ప్రాధాన్యత తగ్గించే విధంగా మేడిగడ్డలో CM బహిరంగ సభ ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. మంత్రి శ్రీధర్ బాబు అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతి, KCR తీసుకున్న నిర్ణయాలు, సాంకేతిక వైఫల్యాలను ఈ సభ ద్వారా ఎండగట్టాలని CM యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News April 17, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు అక్షయ తృతీయ ముంగిట తగ్గి కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,370 తగ్గి రూ.1,54,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,250 పతనమై రూ.1,41,350 పలుకుతోంది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,75,000గా ఉంది.

News April 17, 2026

మాట్లాడే విధానం ఎంతో కీలకం

image

ఏదైనా చర్చలో పాల్గొన్నప్పుడే మనిషి వ్యక్తిత్వం బయటపడుతుంటుంది. అందుకే ఉద్యోగ నియామకాల్లో గ్రూప్‌ డిస్కషన్లు పెడుతుంటారు. అలాంటప్పుడు తోటివారికి అవకాశం ఇవ్వకుండా మీరే మాట్లాడకూడదు. మీరు చెప్పాలనుకున్నది వివరిస్తూనే ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి. దానివల్ల ఒకరి అభిప్రాయాలు మరొకరికి స్పష్టంగా తెలిసి చర్చ అర్థవంతంగా ముగుస్తుంది. అలాగే ఆలుమగల మధ్య కూడా ఏదైనా సమస్య వస్తే భాగస్వామికీ మాట్లాడే ఛాన్సివ్వాలి.