News April 24, 2024
సూర్యాపేట: కాలేజ్కి వెళ్లే టెన్షన్లో ఘోరం

మునగాల మండలం ముకుందాపురం వద్ద <<13101789>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతి చెందిన దంపతులు వివరాలు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన సామినేని నవీన్ రాజ, భార్గవి దంపతులు సోమవారం ఉదయం 6 గంటలకు విజయవాడకు బయలుదేరారు. నవీన్ రాజా విజయవాడలో శ్రీచైతన్య కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్నాడు. కళాశాలకు చేరుకోవాలని కంగారులో అతివేగంగా డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Similar News
News October 18, 2025
ఎంత రాత్రి అయినా దరఖాస్తులు తీసుకుంటాం: సంతోష్

మద్యం టెండర్లకు ఇవాళ ఆఖరి రోజు అయినందున దరఖాస్తుదారులు ఇబ్బంది పడకుండా కౌంటర్లు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. ఇప్పుడు 14 కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు తెలిపారు. 5 గంటల్లోపు దరఖాస్తులతో వచ్చిన వారి నుంచి ఎంత రాత్రైనా దరఖాస్తులు తీసుకుంటామని తెలిపారు.
News October 18, 2025
NLG: నేడే లాస్ట్ ఛాన్స్.. ఒక్కరోజే 1,387 దరఖాస్తులు

మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఊపందుకున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 1,387 దరఖాస్తులు వచ్చాయి. రాత్రి 8 గంటల వరకూ లైన్లో ఉండి దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటివరకు మొత్తం 2,439 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది.
News October 18, 2025
ఉమ్మడి జిల్లాలో మరో ఆరు కొత్త బ్రాంచులు

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరిధిలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరో 6 కొత్త బ్రాంచీల ఏర్పాటుకు ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చింది. చిలుకూరు, మోతె, శాలిగౌరారం, నాంపల్లి, పెద్దవూర, మిర్యాలగూడ టౌన్లో 2వ బ్రాంచ్ ఏర్పాటు చేయనున్నట్లు డీసీసీబీ ఛైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఆరు బ్రాంచులతో కలిపి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 47 బ్రాంచీలు అవుతాయని తెలిపారు.