News March 30, 2025

సూర్యాపేట: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మంత్రి సీతక్క ఫైర్

image

రాష్ట్రానికి కాంగ్రెస్ కరప్షన్ వైరస్ సోకిందని, రాష్ట్రంలో సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో హుజూర్ నగర్‌కు వెళ్తుండగా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.

Similar News

News October 26, 2025

మహిళల కోసం మెప్మా కొత్త కార్యక్రమాలు

image

ఏపీలో లక్షమంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. MEPMA ద్వారా చేపట్టే 8 కార్యక్రమాలు మహిళ పారిశ్రామిక వేత్తలకు మార్గదర్శకం కానున్నాయి. పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు, ప్రోత్సహించేందుకు అవసరమైన సమాచార పుస్తకాలు ప్రభుత్వం రూపొందించింది. వీటిని మహిళా సాధికారత, డిజిటల్ శిక్షణ, స్థిరమైన జీవనోపాధిని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించారు.

News October 26, 2025

NTR: డెంగీ జ్వరం కాదు.. లంగ్స్ ఇన్ఫెక్షన్‌తోనే ఉద్యోగి మృతి.!

image

విజయవాడ 61 డివిజన్ ప్రశాంతినగర్‌కు చెందిన CRPగా పనిచేస్తున్న శివదుర్గ అనే మహిళ డెంగీతో చనిపోలేదని డిప్యూటీ DMHO ఇందుమతి తెలిపారు. ఇటీవల నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దగ్గు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పితో శివదుర్గ అడ్మిట్ అయ్యారని.. 4 రోజులు ట్రీట్మెంట్ పొందిన తర్వాత పరిస్థితి విషమించి చనిపోయినట్లు చెప్పారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ కారణంగానే చనిపోయిందని.. డెంగీ వల్ల కాదని స్పష్టం చేశారు.

News October 26, 2025

WC జర్నీ.. RO-KO ఆడే సిరీస్‌లు ఎన్నంటే?

image

AUS సిరీస్‌‌ 3వ వన్డేలో భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతామన్న సంకేతాలిచ్చారు. అప్పటి వరకు మరో 8 వన్డే సిరీస్‌ల్లో RO-KO షో చూసే అవకాశముంది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్‌, WI, శ్రీలంకతో స్వదేశంలో, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో ఆయా దేశాల్లో టీమ్‌ఇండియా 3 మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడనుంది. వీటితో పాటు ఆసియా కప్‌‌లోనూ వీరు మెరిసే అవకాశముంది.