News March 30, 2025
సూర్యాపేట: కేంద్రమంత్రి బండి సంజయ్పై మంత్రి సీతక్క ఫైర్

రాష్ట్రానికి కాంగ్రెస్ కరప్షన్ వైరస్ సోకిందని, రాష్ట్రంలో సన్నబియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పటేల్ రమేష్ రెడ్డి నివాసంలో హుజూర్ నగర్కు వెళ్తుండగా మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన 12సంవత్సరాల్లో సన్నబియ్యం ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలేదో చెప్పాలన్నారు.
Similar News
News December 1, 2025
మేడారంలో ఏ చిన్న పొరపాటు జరిగినా చర్యలు తప్పవు: సీఎం

మేడారం జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పనులలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. స్తపతి శివనాగిరెడ్డితో సమన్వయం చేసుకుంటూ, సంప్రదాయాలు పాటిస్తూ నిర్దేశిత సమయానికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, రోడ్లు, భక్తుల విడిది, దర్శన ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు.
News December 1, 2025
100% పన్నులు వసూలు చేయాలి: కలెక్టర్

PDPL పట్టణంలో అభివృద్ధి పనులను కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం సమీక్షించారు. టి.యూ.ఎఫ్.ఐ.డి.సి కింద పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పాత వాటర్ ట్యాంకర్ కూల్చాలని, కొత్త ట్యాంకర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్లను 100% వసూలు చేయాలని, చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. ఉల్లంఘనలకు జరిమానాలు విధించాలన్నారు.
News December 1, 2025
పాఠకులు గ్రంథాలయాన్ని వాడుకుంటే మంచి ఫలితాలు: కలెక్టర్

PDPL జిల్లా గ్రంథాలయాన్ని సోమవారం సందర్శించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష పాఠకులకు అందుబాటులో ఉన్న వసతులను పరిశీలించి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువుకు అనుకూల వాతావరణం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులు సమయపాలన పాటించి, గ్రంథాలయాన్ని సక్రమంగా ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ మోటివేట్ చేశారు.


