News February 11, 2026

సూర్యాపేట: క్యూ లైన్‌లో నిలబడి ఓటేసిన కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పట్టణంలోని 14వ నంబర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ సందర్శించారు. ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన అనంతరం, సామాన్య ఓటరులా క్యూలైన్‌లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ఓటర్ల సౌకర్యార్థం అన్ని కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు.

Similar News

News March 17, 2026

విశాఖ: సరెండర్ తర్వాత భవానీ శంకర్‌కు పోస్టింగ్

image

విశాఖలో DROగా పనిచేసి సరెండర్ అయిన భవానీ శంకర్‌కు ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. గతేడాది RDO శ్రీలేఖతో విభేదాల కారణంగా ఇద్దరినీ సరెండర్ చేశారు. అప్పటి నుంచి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆయనను కాకినాడ జిల్లా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News March 17, 2026

ప్రమాదాలు తగ్గాయి.. ఇదే చొరవ కొనసాగించాలి: కలెక్టర్

image

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తగ్గాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. 2024లో 1,046 ప్రమాదాలు జరిగాయని, 2025 లో 910 జరిగాయని తెలిపారు. మరణాలు కూడా 19 శాతం తగ్గాయని చెప్పారు.

News March 17, 2026

ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి సవిత సమీక్ష

image

పెనుకొండలోని ఆర్&బీ అతిథి గృహంలో మంత్రి సవిత మండల స్థాయి అధికారులతో ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్ పథకానికి దరఖాస్తు చేసుకున్న ప్రతీ లబ్ధిదారుకు ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని, 2014-19 కాలంలో ఇల్లు నిర్మించి బిల్లులు పొందని లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.