News February 14, 2025
సూర్యాపేట: ఖండాలు దాటిన ప్రేమ

ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. NLG(D) దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదే కంపెనీలో మేజేజర్గా పనిచేస్తున్న అమెరికా యువతి అవని ఏలేనాతో ప్రేమలోపడ్డాడు. ఈనెల 7న ఘట్కేసర్లో వీరి వివాహ జరిగింది.
Similar News
News December 6, 2025
WGL: 22 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ASIలుగా పదోన్నతి

హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ ఇన్ఛార్జ్ రేంజ్ డీఐజీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి జోన్ పరిధిలోని వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 22 మందికి పదోన్నతి కల్పించారు. ఈమేరకు జోన్ పరిధిలో వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
News December 6, 2025
‘జీవీఎంసీ స్థాయి సంఘంలో అభివృద్ధి పనులకు ఆమోదం’

విశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘం సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు నగర మేయర్, స్థాయి సంఘం చైర్పర్సన్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మొత్తం 287 అంశాలై చర్చించగా, 222 ప్రధాన అంశాలు, 30 టేబుల్ అజెండాలకు ఆమోదం లభించిందన్నారు.
News December 6, 2025
రెడ్ క్రాస్ వ్యవస్థను బలోపేతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో రక్త కొరత రాకుండా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ జి.రాజకుమారి కమిటీ సభ్యులను సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ నూతన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రతీ పాఠశాలలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్లను, ప్రతీ కళాశాలలో యూత్ రెడ్ క్రాస్ బృందాలను ఏర్పాటు చేసి దాదాపు లక్ష మంది విద్యార్థులను రెడ్ క్రాస్ సభ్యులుగా నమోదు చేసుకోవాలని సూచించారు.


