News February 4, 2025
సూర్యాపేట: చికెన్ ముక్క కోసం పంచాయితీ

చికెన్ ముక్క రెండు గ్రామాల మధ్య వివాదానికి తెరలేపింది. స్థానికుల వివరాలు.. మేళ్లచెరువులోని ఓ చికెన్ దుకాణంలో మరో గ్రామానికి చెందిన వ్యక్తి చికెన్ కొనుగోలు చేశాడు. చికెన్ ముక్క కోరిన విధంగా ఇవ్వలేదని ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు దాడి చేశాడు. షాపు నిర్వాహకుడిపై బాధితుడి తరఫు బంధువులు దాడి చేశారు. దీంతో 2 గ్రామాల మధ్య పంచాయితీ మొదలై పెద్ద మనుషుల జోక్యంతో చికెన్ షాప్ యజమానికి జరిమానా విధించారు.
Similar News
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్కు PMను ఆహ్వానించాలి: సీఎం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్కు PMను ఆహ్వానించాలి: సీఎం

TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభోత్సవానికి PM మోదీ, కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని CM రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. 2,600 మందికి ఆహ్వానం అందించామని CMకు అధికారులు తెలియజేశారు.
News November 26, 2025
రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు: కలెక్టర్

ధాన్యం పంట కోత సమయంలో రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. జిల్లాలో 74 రైస్ మిల్లులు ఉండగా, యజమానులంతా బ్యాంకు పూచికతలు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉందన్నారు. రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరణ నేపథ్యంలో రూ.200 కోట్లు పూచికతలు రైస్ మిల్లుల నుంచి రావాలన్నారు. ప్రతి మిల్లులో తేమ యంత్రాలు విధిగా ఉండాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో సరిగ్గా పని చేయాలన్నారు.


