News March 16, 2025

సూర్యాపేట: జిల్లాలో చికెన్ ధరలు ఇలా

image

సూర్యాపేట జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్(విత్‌ స్కిన్) కేజీ రూ.170-180 ఉండగా..స్కిన్‌లెస్ కేజీ రూ.200 ధర పలుకుతోంది. అలాగే లైవ్ కోడి రూ.110-120 మధ్య ఉంది. కాగా, బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా, ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. 

Similar News

News November 23, 2025

బాపట్ల: 108 వాహనాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

image

బాపట్ల జిల్లా 108 వాహనాల్లో పైలట్ పోస్ట్‌లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ పి.బాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పైలట్ పోస్ట్‌కు 10th పాస్, హెవీ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ , బ్యాడ్జ్ అర్హతలు కలిగి ఉండాలన్నారు. అర్హులైన వారు నవంబర్ 24వ తేది(సోమవారం) సాయంత్రం లోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News November 23, 2025

అంబానీ స్కూల్.. ఫీజులు తెలిస్తే షాకే!

image

అంబానీ ఫ్యామిలీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (ముంబై) ఏడాది ఫీజులపై నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
*కిండర్‌గార్టెన్ నుంచి 7వ తరగతి: రూ.1.70 లక్షలు
*8-10th (ICSE): రూ.1.85 లక్షలు
*8-10th (IGCSE): రూ.5.9 లక్షలు
*11-12th (IBDP): రూ.9.65 లక్షలు
> షారుఖ్ ఖాన్, కరీనాకపూర్, ఐశ్వర్యరాయ్‌తో పాటు ఇతర సెలబ్రిటీల పిల్లలు ఇక్కడ చదువుతున్నారు.

News November 23, 2025

KMR: పెళ్లిరోజునే కాంగ్రెస్ అరుదైన గిఫ్ట్

image

నిజాంసాగర్‌కు చెందిన మల్లికార్జున్ ఆలే కామారెడ్డి DCC అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన రాజకీయ ప్రస్థానం 2000 స.లో కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. మొదట నిజాంసాగర్ NSUI అధ్యక్షుడిగా ఆ తర్వాత మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా, మండల వైస్ MPPగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. నిబద్ధతకు గుర్తింపుగా జిల్లా అధ్యక్ష పదవి వరించింది. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే శుభవార్త రావడం విశేషం.