News February 23, 2025
సూర్యాపేట జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు: డాక్టర్

సూర్యాపేట జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య అన్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వ్యాధి సోకిన కోళ్లు రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. శనివారం అనంతగిరి మండలం కిష్టాపురంలో ఓ కోళ్లఫారాన్ని సందర్శించారు. కోళ్లకు దాణా, నీరు నిలిపివేయడం మూలంగానే కోళ్లు చనిపోతున్నాయని చెప్పారు. ఫాం యజమానులకు పలు సూచనలు చేశారు.
Similar News
News September 18, 2025
HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.
News September 18, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ అయిన నాలుగు రోజుల తర్వాత తిరిగి అదే మొత్తాన్ని మరోసారి జమ చేశారు. ఈ విషయం గమనించిన గృహనిర్మాణ శాఖ అధికారులు డబుల్ బిల్లులు పొందిన లబ్ధిదారుల నుంచి డబ్బును రికవరీ చేసి, ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని స్థానిక ఏఈ, ఎంపీడీవోలను ఆదేశించారు.
News September 18, 2025
ADB: చుక్క నీటి కోసమే చుట్టూ పోరాటం!

ధనరాశులు ఎంతైనా పోగుచేయగలం కానీ, జలరాశులను సృష్టించలేం. నీటిని వృథా చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనడానికి ఉమ్మడి ADBలో ఏర్పడిన ఘటనలే నిదర్శనం. 5నదులు, 14 వాగులు, 3500+ చిన్న నీటి వనరులున్న జిల్లాలో వానాకాలంలో తాగునీటి కష్టాలు చూస్తున్నాం. పట్టణాల్లో చెరువులు, వాగులను ఆక్రమించడంతో వానలకు వరదలు రాగా.. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించుకునే పరిస్థితి.
#నేడు నీటి పర్యవేక్షణ దినోత్సవం.