News February 28, 2025
సూర్యాపేట: జిల్లాలో 94.97 శాతం పోలింగ్ నమోదు

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 2664 ఓటర్లుండగా.. 94.97 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ ప్రీత్ సింగ్ జిల్లా వ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. టీచర్స్ ఎమెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,664 ఓట్లకు గాను 2,530 మంది జిల్లా వ్యాప్తంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.
Similar News
News November 20, 2025
గ్రామాల దేవాలయాలకు సోలార్ భద్రత: చిలుకూరు అర్చకుడు

సీఎస్ఆర్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకులు, దేవాలయాల భాగస్వామ్యానికి కొత్త దారిని చూపుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ ముందడుగు వేశారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో 60 సోలార్ ఆధారిత సీసీ కెమెరాలను అందించారు. వీటిని ఎస్బీఐ, యూబీఐ సంయుక్తంగా అందజేశారు. ఇలాంటి రిమోట్ సర్వైలెన్స్ సొల్యూషన్లను సీఎస్ఆర్కు అనుసంధానించడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొ న్నారు.
News November 20, 2025
గ్రామాల దేవాలయాలకు సోలార్ భద్రత: చిలుకూరు అర్చకుడు

సీఎస్ఆర్ ద్వారా దేశవ్యాప్తంగా బ్యాంకులు, దేవాలయాల భాగస్వామ్యానికి కొత్త దారిని చూపుతూ చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్ ముందడుగు వేశారు. మొయినాబాద్ మండలంలోని పలు గ్రామాల్లోని దేవాలయాల్లో 60 సోలార్ ఆధారిత సీసీ కెమెరాలను అందించారు. వీటిని ఎస్బీఐ, యూబీఐ సంయుక్తంగా అందజేశారు. ఇలాంటి రిమోట్ సర్వైలెన్స్ సొల్యూషన్లను సీఎస్ఆర్కు అనుసంధానించడం దేశంలో ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొ న్నారు.
News November 20, 2025
చట్టప్రకారమే KTRపై చర్యలు: మహేశ్ గౌడ్

TG: ఫార్ములా ఈ-కార్ రేస్లో KTR తప్పు చేశారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ‘BRS హయాంలో జరిగిన ప్రజాధన దోపిడీని సరిచేస్తుందనే కాంగ్రెస్కు అధికారమిచ్చారు. అందుకే అన్నింటిపై కమిషన్లు వేశాం. రూల్స్ అతిక్రమించి KTR ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తికి పంపారని కమిషన్ రిపోర్టులో ఉంది. అప్పటి మంత్రిగా ఆయన తప్పు ఒప్పుకోవాలి. గవర్నర్ అనుమతించారు కాబట్టి చట్టం తనపని తాను చేస్తుంది’ అని తెలిపారు.


