News February 24, 2025

సూర్యాపేట జిల్లా టాప్ న్యూస్

image

☞  లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించిన స్టేట్ హౌసింగ్ ఎండీ, కలెక్టర్ ☞ సూర్యాపేటలో ఉచితంగా చికెన్, ఎగ్ మేళా ☞  మేళ్లచెరువు జాతరకు ప్రత్యేక బస్సులు ☞  చిలుకూరులో యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు ☞  తుంగతుర్తిలో సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ☞  సూర్యాపేట: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: టీడబ్ల్యూజేఎఫ్

Similar News

News November 24, 2025

జగిత్యాల: ‘ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి’

image

ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం పలువురి నుంచి ఆయన ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. 57 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

News November 24, 2025

వారంలోగా సమస్యలు పరిష్కరించాలి: కాకినాడ ఎస్పీ

image

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 అర్జీలు వచ్చాయి. వీటిలో భూ తగాదాలు 10, కుటుంబ సమస్యలు 8, ఇతరత్రా 24 ఉన్నట్లు ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. అర్జీదారులతో ఆయన ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ అర్జీలను వారంలోగా పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం చేయాలని సంబంధిత ఎస్‌హెచ్‌వోలను ఎస్పీ ఆదేశించారు.

News November 24, 2025

వరంగల్: భారీగా పతనమవుతున్న మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం భారీగా తగ్గింది. నేడు మార్కెట్లో మొక్కజొన్న ధర రూ.1,970కి పడిపోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే, మార్కెట్‌లో కొత్త తేజ మిర్చికి రూ.14,500 ధర రాగా.. దీపిక మిర్చికి సైతం రూ.14,500 ధర వచ్చింది.