News February 24, 2025
సూర్యాపేట జిల్లా టాప్ న్యూస్

☞ లబ్ధిదారుల ఇళ్లను పరిశీలించిన స్టేట్ హౌసింగ్ ఎండీ, కలెక్టర్ ☞ సూర్యాపేటలో ఉచితంగా చికెన్, ఎగ్ మేళా ☞ మేళ్లచెరువు జాతరకు ప్రత్యేక బస్సులు ☞ చిలుకూరులో యాక్సిడెంట్.. ఇద్దరికి గాయాలు ☞ తుంగతుర్తిలో సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ☞ సూర్యాపేట: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: టీడబ్ల్యూజేఎఫ్
Similar News
News September 18, 2025
ఎంజీయూలో వివిధ విభాగాలకు నూతన అధిపతుల నియామకం

మహాత్మా గాంధీ యూనివర్సిటీలోని వివిధ విభాగాలకు నూతన అధిపతులను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. రసాయన శాస్త్ర విభాగానికి డా. ఎం.జ్యోతి, గణిత శాస్త్ర విభాగానికి డా. జి.ఉపేందర్రెడ్డి, భౌతిక శాస్త్ర విభాగానికి డా. శాంత కుమారి, రసాయన శాస్త్ర విభాగం బీఓఎస్ (బోర్డ్ ఆఫ్ స్టడీస్)గా డా. ఆర్.రూప నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఆయా విభాగాలకు అధిపతులుగా వ్యవహరిస్తారు.
News September 18, 2025
HYD: ప్రాణాలు పోతున్నా.. మారని పరిస్థితి..!

హైదరాబాద్లో మ్యాన్హోల్స్లో పడి అనేక మంది ప్రాణాలు పోతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదని నగర ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో డ్రైనేజీ మ్యాన్హోల్లో పడి అనేక మంది మరణించారు. ఇటీవల ఓ చిన్నారి సైతం మ్యాన్హోల్లో పడింది. అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయి. బహదూర్పుర నుంచి కిషన్బాగ్ రోడ్డులో ఈ పరిస్థితి నిర్లక్ష్యానికి నిదర్శనం.
News September 18, 2025
JGTL: మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్త్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆరోగ్యం కోసం నేటి నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా చూయించుకోవాలన్నారు. MLA సంజయ్ కుమార్, DMHO ప్రమోద్ కుమార్, తదితరులున్నారు.