News January 30, 2025
సూర్యాపేట జిల్లా నుంచి నలుగురికి చోటు

సీపీఎం రాష్ట్ర కమిటీలో సూర్యాపేట జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర మహాసభలో మల్లు లక్ష్మి మూడోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మల్లు నాగార్జున్ రెడ్డి మూడో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నూతనంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరిరావులను ఎన్నుకున్నారు.
Similar News
News December 9, 2025
పెళ్లి రద్దు చేసుకున్న హీరోయిన్?

వ్యాపారవేత్త రాజ్హిత్ ఇబ్రాన్తో హీరోయిన్ నివేదా పేతురాజ్ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరి వివాహం రద్దయినట్లు ప్రచారం జరుగుతోంది. తన ఇన్స్టా అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ పోస్ట్ను తొలగించడం, ఇద్దరూ ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ఇటీవలే క్రికెటర్ స్మృతి మంధాన వివాహం కూడా ఎంగేజ్మెంట్ తర్వాత రద్దయింది.
News December 9, 2025
వాజ్పేయి పాలసీలతో అభివృద్ధికి పునాది: CM

AP: ఈనెల 11-25 మధ్య జరిగే ‘అటల్ సందేశ్.. మోదీ సుపరిపాలన యాత్ర’లో కూటమి నేతలంతా పాల్గొనాలని CM CBN సూచించారు. వాజ్పేయి సుపరిపాలనకు నాంది పలికారని, ఆయన పాలసీలతోనే దేశాభివృద్ధికి పునాది పడిందని చెప్పారు. రోడ్లు, విమానయాన, టెలీ కమ్యూనికేషన్ రంగాల్లో సంస్కరణలు తెచ్చారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే స్పందించేవారన్నారు. PM మోదీ దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని కొనియాడారు.
News December 9, 2025
కోనసీమ: లంచం అడిగితే.. ఈ నంబర్లకు కాల్ చేయండి.!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా, ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ACB అధికారులు కోరుతున్నారు. ACB DSP 9440446160, సీఐలు 9440446161, 8332971041, టోల్ ఫ్రీ 1064కు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. కాగా నేడు అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం. ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు.


