News January 30, 2025
సూర్యాపేట జిల్లా నుంచి నలుగురికి చోటు

సీపీఎం రాష్ట్ర కమిటీలో సూర్యాపేట జిల్లా నుంచి నలుగురికి చోటు దక్కింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర మహాసభలో మల్లు లక్ష్మి మూడోసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. మల్లు నాగార్జున్ రెడ్డి మూడో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. నూతనంగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదగిరిరావులను ఎన్నుకున్నారు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


