News March 17, 2025
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు ప్రజావాణి

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కే.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా బాధితులు తమ సమస్యలను ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News November 21, 2025
‘ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పేరు మార్చాలి’

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా, ఎన్టీఆర్ జిల్లాకు కృష్ణా జిల్లాగా పేరు మార్చాలని మంత్రుల కమిటీని కోరినట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్టీఆర్ జన్మించిన నిమ్మకూరు కృష్ణా జిల్లాలో ఉందని పేర్కొన్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని కలపాలన్నారు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల ప్రజలు మచిలీపట్నం వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
News November 21, 2025
టార్గెట్ 1 రన్.. భారత్ ఘోర ఓటమి

ACC మెన్స్ ఆసియా రైజింగ్ స్టార్స్ టోర్నీ <<18351488>>సెమీస్లో<<>> బంగ్లా-Aతో జరిగిన మ్యాచులో భారత్-A చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీయగా మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా సున్నాకే 2 వికెట్లు కోల్పోయింది. ఒక పరుగు టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లా తొలి బంతికి వికెట్ కోల్పోయింది. తర్వాతి బంతిని బౌలర్ సుయాష్ శర్మ వైడ్ వేయడంతో బంగ్లా గెలిచింది. ఈ ఓటమితో భారత్-A జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
News November 21, 2025
వికారాబాద్ నూతన SP స్నేహ మెహ్రా నేపథ్యం ఇదే.!

2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణి స్నేహ మెహ్రా వికారాబాద్ ఎస్పీగా నియమితులయ్యారు. గతంలో వైరా ఏసీపీగా, హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీగా ఆమె పనిచేశారు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా నియమితులైన తొలి మహిళా అధికారిగా గుర్తింపు పొందిన స్నేహ మెహ్రా, ఆరు నెలల పాపతోనే పాతబస్తీలో విధులు నిర్వర్తించి అంకితభావం చాటారు.


