News March 12, 2025
సూర్యాపేట జిల్లా వాసుల ఆశలు నెరవేరేనా..?

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించి తమ ఆశలు నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. సూర్యాపేట ఆటోనగర్లో ఐటీ కారిడార్ ఏర్పాటు, ఎస్సారెస్పీ కాల్వలకు నిధులు కేటాయించాలంటున్నారు. తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు.
Similar News
News March 24, 2025
ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తాజా సమాచారం

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. మొత్తం 20.18 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 9.14 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయితే 473.03 అడుగుల వరకు నీటి నిల్వ ఉంది. కాగా 804 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, వివిధ అవసరాల ప్రాజెక్ట్ నుండి1485 క్యూసెక్కుల ని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
News March 24, 2025
తెరపై మెరిసిన క్రికెటర్లు వీళ్లే!

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘రాబిన్హుడ్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. క్రికెటర్లు సినిమాల్లోకి రావడం కొత్తేమీ కాదు. తెరపై మెరిసిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అందులో బ్రెట్లీ- అన్ఇండియన్, పఠాన్ – కోబ్రా, యువరాజ్- పుట్ సరదారన్ దే, మెహందీ షగ్రా దిలలో బాలనటుడిగా, సచిన్ తన డాక్యుమెంటరీలో, కపిల్ దేవ్-83, అజయ్ జడేజా- ఖేల్, సునీల్ గవాస్కర్ – పదుల సినిమాల్లో నటించారు.
News March 24, 2025
జగిత్యాల ప్రజావాణిలో 32 ఫిర్యాదులు

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 32 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, మెట్ పల్లి ఆర్డిఓ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.