News February 14, 2025

సూర్యాపేట: టీచర్ ఎమ్మెల్సీ పోటీలో నిలిచింది వీరే..

image

WGL-KMM-NLG టీచర్ MLC బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. వారిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్రెడ్డి పింగిళి, పూల రవీందర్, గాల్రెడ్డి హర్ష వర్ధన్రెడ్డి, సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, లింగిడి వెంకటేశ్వర్లు, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి, ఏలె చంద్రమోహన్, చంద్రశేఖర్, జంకిటి కైలాసం, జి.శంకర్, పురుషోత్తం రెడ్డి, వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు ఉన్నారు.

Similar News

News December 8, 2025

శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

image

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.

News December 8, 2025

జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు దావోస్‌ పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 23 వరకు అక్కడ ఆయన పర్యటించనున్నారు. దావోస్‌‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. ఆయన బృందంలో మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. సీఎం తన పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలను కలిసే అవకాశం ఉంది.

News December 8, 2025

జగిత్యాల: బస్సు ఛార్జీలు ఇస్తాం.. వచ్చి ఓటేయండి

image

జగిత్యాల జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటు అభ్యర్థులకు కీలకం కావడంతో ఓట్లు వేయించుకోవడానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామానికి చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాలలో ఉంటే వారికి ఫోన్లు చేసి గ్రామానికి వచ్చి తనకు ఓటు వేసి వెళ్తే బస్సు ఛార్జీలు ఇస్తామని, వచ్చి ఓటేయండని ప్రాధేయపడుతున్నారు. దీంతో వస్తామని కొందరు, ఒక్క ఓటు కోసం ఏం వస్తాంలే అని మరికొందరంటున్నారు.