News February 14, 2025
సూర్యాపేట: టీచర్ ఎమ్మెల్సీ పోటీలో నిలిచింది వీరే..

WGL-KMM-NLG టీచర్ MLC బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. వారిలో అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్రెడ్డి పింగిళి, పూల రవీందర్, గాల్రెడ్డి హర్ష వర్ధన్రెడ్డి, సుందర్రాజు, కొలిపాక వెంకటస్వామి, లింగిడి వెంకటేశ్వర్లు, అర్వ స్వాతి, కంటె సాయన్న, పన్నాల గోపాల్రెడ్డి, ఏలె చంద్రమోహన్, చంద్రశేఖర్, జంకిటి కైలాసం, జి.శంకర్, పురుషోత్తం రెడ్డి, వెంకటరాజయ్య, దామెర బాబురావు, బంక రాజు ఉన్నారు.
Similar News
News November 23, 2025
అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR

AP: తనకు వేరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(VSR) అన్నారు. ప్రస్తుతానికి తాను రైతు మాత్రమేనని చెప్పారు. ఇతర పార్టీల్లోనూ చేరే ఉద్దేశమూ లేదని పేర్కొన్నారు. అవసరం వస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందన్నారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిబద్ధత లేని వారి మాటలు జగన్ వినకూడదని సూచించారు.
News November 23, 2025
భీమవరం: ఘనంగా సత్యసాయి శత జయంతి ఉత్సవాలు

భీమవరంలో సత్యసాయి మందిరంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని, బాబా చిత్రపటానికి నివాళులర్పించారు. మానవసేవే మాధవసేవగా బాబా అందించిన సేవలు చిరస్మరణీయమని వారు కొనియాడారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే ఐదు సూత్రాలను అందరూ పాటించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
News November 23, 2025
సంగారెడ్డి: ‘మహిళలు ఆర్థికంగా ఎదగడమే లక్ష్యం’

సంగారెడ్డి జిల్లాలో డ్వాక్రా గ్రూపు మహిళలకు రూ. 590 కోట్ల రుణాలను అందించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రూ. 32 కోట్ల వడ్డీ రాయితీ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే సీఎం రేవంత్ రెడ్డి లక్షమని పేర్కొన్నారు.


