News January 13, 2025
సూర్యాపేట: తాగి వచ్చి వేధింపులు.. భర్త హత్య

సూర్యాపేట జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన సైదులు కారు డ్రైవర్. అతనికి రమ్య, సుమలత అనే ఇద్దరు భార్యలున్నారు. సైదులు తాగి వచ్చి వారిని వేధిస్తున్నాడు. ఈక్రమంలో ఇద్దరు భార్యలు కలిసి సైదులును ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 14, 2025
నల్గొండ: MGU ఇంగ్లిష్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా అరుణ ప్రియ

MG యూనివర్సిటీ ఆంగ్ల విభాగం అధ్యాపకురాలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కే.అరుణ ప్రియను ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్గా నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు సేవలు అందించనున్న అరుణ ప్రియ ఆంగ్ల భాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.
News February 14, 2025
UPDATE: అక్కంపల్లి రిజర్వాయర్లో మృతి చెందిన కోళ్లు

పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మృతి చెందిన కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పడేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రిజర్వాయర్ను దేవరకొండ RDO రమణారెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ వెనక జలాలలో దాదాపు 80 కోళ్లు లభ్యం అయ్యాయి. రిజర్వాయర్లో కోళ్లను ఎవరు పడేసి ఉంటారో అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆర్డీఓ చెప్పారు. ఈ ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.
News February 14, 2025
ఖండాలు దాటిన ప్రేమ.. నల్గొండ అబ్బాయి.. అమెరికా అమ్మాయి

ఉద్యోగం చేస్తూ వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఖండాలు వేరైనా ఒకరినొకరు ఇష్టపడ్డారు. NLG(D) దాచారం గ్రామానికి చెందిన సందీప్ ఉన్నత చదువుల కోసం పదేళ్లక్రితం అమెరికాకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తిచేసి టెక్సాస్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో అదే కంపెనీలో మేజేజర్గా పనిచేస్తున్న అమెరికా యువతి అవని ఏలేనాతో ప్రేమలోపడ్డాడు. ఈనెల 7న ఘట్కేసర్లో వీరి వివాహ జరిగింది.