News March 4, 2025

సూర్యాపేట: తాళం వేసిన రెండు ఇళ్లల్లో చోరీ

image

సూర్యాపేట మండలం భాషా నాయక్ తండాలో అదివారం అర్ధరాత్రి దొంగలు రెండిళ్లలో చోరీకి పాల్పడి బంగారం అపహరించుకుపోయారు. ఎస్సై బాలు నాయక్ వివరాలిలా.. భాష నాయక్ తండాకు చెందిన సంకెల్లంబట్ల రామకుమార్ ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. తాళం పగులగొట్టి దుండగులు 17 గ్రాముల పుస్తెలతాడును అపహరించారు. అలాగే శ్రీనివాస్ ఇంట్లో 17 గ్రాముల బ్రాస్లెట్, ఒక ఉంగరం అపహరించారు. కేసు నమోదు అయినట్లు ఎస్ఐ తెలిపారు.

Similar News

News November 24, 2025

భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

image

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.

News November 24, 2025

రాజాం: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

image

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన రాజాం సారధి రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. రాజాంలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న ఉర్లాపు సావిత్రి (30) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సావిత్రి ఉరి వేసుకుని మృతి చెందడం పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి భర్త, కొడుకు, కుమర్తె ఉన్నారు. పోలీసులు సంఘటన స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

News November 24, 2025

ADB: భర్త క్రూరత్వం.. భార్యపై ఇనుప పట్టీతో దాడి

image

తాంసి మండలం కప్పర్లకి చెందిన మల్లెల నరేశ్‌ తన భార్య లావణ్యపై దాడి చేశాడు. మద్యం మత్తులో భార్యతో గొడవపడిన నరేశ్‌, కోపంతో ఇనుప పట్టీతో ఆమె తలపై తీవ్రంగా కొట్టాడు. గాయపడిన లావణ్యను కుటుంబ సభ్యులు రిమ్స్‌‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనపై తాంసి SI జీవన్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.