News February 4, 2025
సూర్యాపేట: తొలి రోజే 346 మంది డుమ్మా!

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలకు ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1086 మంది హాజరుకావాల్సి ఉండగా 872 మంది మాత్రమే హాజరయ్యారు. 214 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 918 మందికి 883 మంది పరీక్షకు హాజరు కాగా 35 మంది హాజరుకాలేదు. మధ్యాహ్నం ఒకేషనల్ ప్రాక్టికల్స్కు 985 మందికి 888మంది హాజరుకాగా 97 మంది ప్రాక్టికల్స్ రాయలేదు.
Similar News
News October 27, 2025
ఎన్టీఆర్: వాయిదా పడిన కేంద్ర మంత్రి నిర్మల అమరావతి పర్యటన

అమరావతిలో మంగళవారం జరగాల్సిన బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం వాయిదా పడింది. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా జరగాల్సిన ఈ కార్యక్రమం వాయిదా పడింది. కార్యక్రమం జరిగే తదుపరి తేదీ తెలియాల్సి ఉంది. కాగా ఉద్దండరాయునిపాలెంలో 12 బ్యాంకులకు CRDA స్థలాలు కేటాయించగా..శంకుస్థాపన జరిగిన అనంతరం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
News October 27, 2025
మామునూర్: నిందితుల పరారీ.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్

కొద్ది రోజుల క్రితం మామునూరు పోలీస్ స్టేషన్లో ఇద్దరు గంజాయి నిందితులు పరారైన ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేస్తూ, స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేశ్కు మెమో జారీ చేసినట్లు సమాచారం. పరారైన ఇద్దరు నిందితులు గంజాయి విక్రయిస్తూ టాస్క్ఫోర్సు పోలీసులకు పట్టుబడగా వారిని మామునూర్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
News October 27, 2025
నర్వ: వారు చేసిన పని.. ఒక ప్రాణం తీసింది!

గత వారం గాజులయ్య తండా సమీపంలో రోడ్డుకు ఉన్న చెట్లకు పశువులను కట్టేయడంతో, బైక్పై వెళ్తున్న నర్వ మండలం ఉందేకోడు గ్రామానికి చెందిన వాటర్మెన్ నర్సింలు (52) అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రోడ్డు పక్కన పశువులను కట్టేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఒక నిండు ప్రాణం బలైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


