News February 4, 2025
సూర్యాపేట: తొలి రోజే 346 మంది డుమ్మా!

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలకు ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1086 మంది హాజరుకావాల్సి ఉండగా 872 మంది మాత్రమే హాజరయ్యారు. 214 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 918 మందికి 883 మంది పరీక్షకు హాజరు కాగా 35 మంది హాజరుకాలేదు. మధ్యాహ్నం ఒకేషనల్ ప్రాక్టికల్స్కు 985 మందికి 888మంది హాజరుకాగా 97 మంది ప్రాక్టికల్స్ రాయలేదు.
Similar News
News November 27, 2025
కామారెడ్డి జిల్లాలో స్థిరంగా చలి ప్రభావం

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత మూడు రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రత 13°C లుగా నమోదవుతుంది. జిల్లావ్యాప్తంగా గడిచిన 24గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. బీబీపేట 13.8°C, జుక్కల్ 14.6, రామలక్ష్మణపల్లి, బొమ్మన్ దేవిపల్లి, గాంధారి 14.9, నస్రుల్లాబాద్, లచ్చపేట 15.1, రామారెడ్డి 15.2, డోంగ్లి, ఎల్పుగొండ 15.3°C లుగా రికార్డ్ అయ్యాయి.
News November 27, 2025
NLG: రైతు పత్తికే వంక!… రైతన్నల అవస్థలు

దళారుల చేతుల్లో పత్తి మిల్లులు ఉండటంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కొండమల్లెపల్లి, కట్టంగూరు, చండూరు మండలాల పరిధిలోని జిన్నింగ్ మిల్లులలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మిల్లుకు తెచ్చిన పత్తిని ఎలాంటి వంకలు పెట్టకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు తెచ్చిన పత్తికి నానా వంకలు పెడుతున్నారని తెలిపారు.
News November 27, 2025
SPF నుంచి వేములవాడకు అదనపు సిబ్బంది

అభివృద్ధి పనులు జరుగుతున్న వేములవాడ క్షేత్రానికి అదనపు భద్రత కల్పించారు. ఇందుకోసం SPF విభాగం నుంచి అదనంగా 12 మంది సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం ఒక ASI, ఇద్దరు HCలు, 10 మంది కానిస్టేబుల్స్ భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. భీమేశ్వరాలయంలో దర్శనాలు ప్రారంభం కావడం, భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అదనంగా మరో ఇద్దరు HCలు, 10 మంది కానిస్టేబుల్స్ను పంపారు. నేటి నుంచి వీరు విధుల్లో చేరనున్నారు.


