News February 4, 2025

సూర్యాపేట: తొలి రోజే 346 మంది డుమ్మా!

image

ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలకు ఒకేషనల్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 1086 మంది హాజరుకావాల్సి ఉండగా 872 మంది మాత్రమే హాజరయ్యారు. 214 మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 918 మందికి 883 మంది పరీక్షకు హాజరు కాగా 35 మంది హాజరుకాలేదు. మధ్యాహ్నం ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌కు 985 మందికి 888మంది హాజరుకాగా 97 మంది ప్రాక్టికల్స్‌ రాయలేదు.

Similar News

News January 22, 2026

ఖల్లీకోట్ స్టేషన్‌లో ఆగనున్న విశాఖ-హౌరా, సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

image

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు ఖల్లీకోట్ రైల్వే స్టేషన్‌లో ప్రయోగాత్మక హాల్ట్‌ను కల్పిస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి సికింద్రాబాద్-భువనేశ్వర్ (17016), సికింద్రాబాద్-హౌరా (12704) రైళ్లు, అలాగే 27 నుంచి భువనేశ్వర్-సికింద్రాబాద్ (17015), హౌరా-సికింద్రాబాద్ (12703) రైళ్లు ఖల్లీకోట్ స్టేషన్‌లో ఆగనున్నాయని తెలిపారు.

News January 22, 2026

గులాబీ తోటలను ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి?

image

శుభకార్యాలు, వ్యక్తిగత అవసరాల కారణంగా ప్రస్తుతం గులాబీ పూల వినియోగం బాగా పెరిగింది. మార్కెట్ డిమాండ్‌ బట్టి గులాబీ సాగుకు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఈ పువ్వుల సాగులో చీడపీడల సమస్య రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా గులాబీ పంటకు పువ్వు, మొగ్గలు తొలిచేపురుగు.. ఆకులను తిని ,రంధ్రాలు చేసే పెంకు పురుగులు, గొంగళి పురుగులు, నల్ల మచ్చ తెగులు, కొమ్మ ఎండు, బూడిద తెగులు ఆశించి నష్టపరుస్తున్నాయి.

News January 22, 2026

నలుపు రంగును అశుభంగా ఎందుకు భావిస్తారు?

image

మన ధర్మశాస్త్రాల ప్రకారం.. నలుపు రంగును చీకటి, శూన్యం, అజ్ఞానానికి చిహ్నంగా పరిగణిస్తారు. అలాగే ఇది శని గ్రహానికి కూడా సంకేతం. కష్టాలను, మందగమనాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అలాగే నలుపు కిరణాలను పీల్చుకుంటుంది. కానీ తిరిగి ప్రసరించదు. అందుకే ఇది ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని శుభకార్యాల్లో నివారిస్తారు. అయితే, దిష్టి తగలకుండా నలుపు చుక్క, దారం వాడుతారు. ఇలా ఈ రంగు రక్షణకు చిహ్నంగా ఉపయోగపడుతుంది.