News March 26, 2025

సూర్యాపేట: ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

image

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు ఉండొద్దని ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేశారు.

Similar News

News April 24, 2025

ఇది మీ స్థాయి.. ఇక్కడ కూడా కాపీనేనా?

image

ఉగ్రదాడికి కౌంటర్‌గా పాకిస్థాన్‌పై భారత్ నిన్న ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ సైతం అదే దారిలో నడిచింది. వీసాల రద్దు, హైకమిషన్ కార్యాలయంలో దౌత్య సిబ్బంది తగ్గింపు, అట్టారీ వాఘా బోర్డర్ మూసివేత, వాణిజ్య కార్యకలాపాల రద్దు ఇలా ప్రతి దాంట్లోనూ మనల్నే కాపీ కొట్టింది. ఇక 1972లో కుదిరిన షిమ్లా ఒప్పందాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

News April 24, 2025

NLR: రేషన్ డీలర్ల వద్దకు పరుగులు

image

రేషన్‌ ఇంటికి రావాలంటే ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి చేసింది. రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించడంతో నెల్లూరు జిల్లాలోని లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఈకేవైసీ చేయండి అంటూ చాలామంది డీలర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఈకేవైసీ స్టేటస్‌ ఇంటర్‌​నెట్​లోనూ చూసుకోవచ్చని అధికారులు సూచించారు.

News April 24, 2025

ఉగ్రదాడి ఘటనపై ముగిసిన అఖిలపక్ష భేటీ

image

పహల్‌గామ్‌ ఉగ్రదాడి ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. అమిత్ షా, జైశంకర్, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొన్నారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న చర్యలపై కేంద్రం వివరించింది. మరోవైపు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ రేపు శ్రీనగర్‌ వెళ్లనున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన అక్కడ పర్యటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

error: Content is protected !!