News April 5, 2024
సూర్యాపేట: ‘నిర్లక్ష్యమే ముగ్గురి ప్రాణాలు తీసింది ‘

సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<12991416>>ముగ్గురు మృతిచెందగా,<<>> 14మందికి గాయాలైన సంగతి తెలిసిందే. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పెద్ద శబ్దంతో సినిమా పాటలు పెట్టి నిర్లక్ష్యంగా ఆటో నడపడం కూడా ప్రమాదానికి ఓ కారణమని బాధితుల బంధువులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదం జరిగేది కాదంటున్నారు.
Similar News
News December 3, 2025
నల్గొండ: నేడు ఉపసంహరణకు ఆఖరు!

మొదటి విడత ఎన్నికలు జరిగే నల్గొండ, చండూరు డివిజన్లోని 14 మండలాల్లో నామినేషన్ల ఉపసంహరణలపై పార్టీలు దృష్టి పెట్టాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన అభ్యర్థి మినహా మిగతా వారితో నామినేషన్ విత్ డ్రా చేయించేలా నాయకులు చర్చలు జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా వెల్లడి కానుంది.
News December 3, 2025
ఆ వివరాలు ఇవ్వకుంటే.. ఇదే జరుగుద్ది: నల్గొండ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా లెక్కలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు అందించాలన్నారు. లేదంటే గెలిచిన వారు పదవులు కోల్పోతారన్నారు. మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారని, ఓడిన వారు కూడా ఇవ్వాల్సిందేనని తెలిపారు.
News December 3, 2025
నల్గొండ: అప్పీల్స్ను పరిశీలించిన కలెక్టర్

నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లతోపాటు తిరస్కరణలపై వచ్చిన అప్పీల్స్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. 9 మండలాల నుంచి ఆర్డీవోలు అశోక్ రెడ్డి, శ్రీదేవి సమర్పించిన జాబితాపై కలెక్టర్ సమగ్ర పరిశీలన చేశారు. నల్గొండ డివిజన్లో వచ్చిన 19 అప్పీల్స్లో 15 తిరస్కరణ,4 అంగీకరించగా చండూరు డివిజన్లో 3 అప్పీలు రాగా వీటిలో 2 తిరస్కరణ, 1 అంగీకరించారు.


