News March 19, 2025

సూర్యాపేట: ప్రజలు వెయిటింగ్.. బడ్జెట్ ఓకేనా!

image

అసెంబ్లీలో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా దానిపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. సూర్యాపేటలో ఆటోనగర్‌లో IT కారిడార్ ఏర్పాటు, SRSP కాల్వలకు నిధులు, MG యూనివర్సిటీకి ఫండ్స్, తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలను ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి కీలక శాఖలకు ఇద్దరు మంత్రులుగా ఉండడంతో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News November 28, 2025

అమ్మకానికి రెండు IPL జట్లు: హర్ష్ గోయెంకా

image

ఒకటి కాదు రెండు ఐపీఎల్ జట్లు అమ్మకానికి వచ్చే అవకాశం ఉందని ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. ‘ఆర్సీబీ మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా అమ్మకానికి వస్తుందని నేను విన్నాను. వీటిని కొనుగోలు చేసేందుకు నలుగురు.. ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, USA ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి’ అని ట్వీట్ చేశారు.

News November 28, 2025

సిద్దిపేట: ఒకే మండలం నుంచి నలుగురు ఏకగ్రీవం

image

సిద్దిపేట జిల్లాలో నలుగురు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జగదేవపూర్ మం. బీజీ వెంకటాపూర్‌లో పరమేశ్వర్, మాందాపూర్‌లో ముత్యం, పలుగుగడ్డ నర్ర కనకయ్య, అనంతసాగర్‌లో కుమార్‌ను గ్రామాల అభివృద్ధి దృష్ట్యా గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నలుగురు బీసీ రిజర్వేషన్ కింద కేటాయించిన అభ్యర్థులే కావటం విశేషం. అయితే వారంతా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సర్పంచులవటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

News November 28, 2025

మచిలీపట్నం: మళ్లీ సేమ్ సీన్ రిపీట్..?

image

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావొస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మంత్రి రవీంద్ర కలిసి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేయలేదు. ఒకట్రెండు సార్లు ప్రెస్‌మీట్‌లలో కలిసి పాల్గొన్నారు. ఇద్దరు నేతల మధ్య సమన్వయ లోపంతో ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా గతంలోనూ మాజీ మంత్రి పేర్నినాని, ఎంపీ బాలశౌరికి అంతర్గత విభేదాలతో ఇదే పరిస్థితి ఉండటం గమనార్హం.