News April 16, 2025
సూర్యాపేట: ప్రతీ మండలంలో అవగాహన కల్పించాలి: కలెక్టర్

భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రతీ మండలంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. అవగాహన కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ తయారు చేయాలని సూచించారు. భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి కలెక్టర్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈనెల 17నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అన్నారు.
Similar News
News October 22, 2025
పాలమూరు: మద్యం షాపు దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఈనెల 23తో ముగియనుంది. ఈసారి 10 వేలకు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేయగా, గడువు పొడిగించినా ఇప్పటివరకు కేవలం 5,188 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరో రెండు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
News October 22, 2025
ADB: పత్తి రైతులకు శుభవార్త

పత్తి రైతులకు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ శుభవార్త చెప్పింది. ఈనెల 27 నుంచి పత్తి కొనుగోలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. పంట విక్రయించే రైతులు కచ్చితంగా కిసాన్ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. స్లాట్ బుకింగ్ ఈనెల 24 నుంచి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన 8 శాతంలోపు తేమతో కూడిన పత్తి తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర 8110 పొందాలని పేర్కొన్నారు.
News October 22, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

TG: రాష్ట్రంలో ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.