News January 29, 2025
సూర్యాపేట: ఫార్మసిస్ట్ యాదగిరిపై చర్యలు తీసుకోండి: కలెక్టర్

మద్దిరాల మండల అధికారులతో ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోయే ఎండాకాలంలో తాగునీటి సమస్య రాకుండా ఉండటానికి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాక్ ఎంట్రీ చేయని ఫార్మసిస్ట్ యాదగిరిపై చర్యలకు ఆదేశించారు. అంగన్వాడీ సెంటర్లో పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి ప్రోటీన్లు ఉన్న ఆహారపదార్థాలను అందించాలన్నారు.
Similar News
News February 19, 2025
ఆన్లైన్ డేటింగ్.. రూ.4.3 కోట్లు మోసపోయిన మహిళ

ఆస్ట్రేలియాలోని పెర్త్కు చెందిన అన్నెట్ ఫోర్డ్ (57) అనే మహిళ ఆన్లైన్ డేటింగ్లో రూ.4.3 కోట్లు మోసపోయారు. భర్తకు దూరమైన అన్నెట్ నిజమైన ప్రేమ కోసం ఆన్లైన్లో వెతుకుతున్నారు. ‘ప్లెంటీ ఆఫ్ ఫిష్’ అనే డేటింగ్ సైట్లో విలియం అనే వ్యక్తితో పరిచయమై రూ.1.6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత FBలో పరిచయమైన నెల్సన్ అనే వ్యక్తి మరో రూ.కోటిన్నర తీసుకున్నాడు. మరో మహిళకు రూ.98.5 లక్షలు ఇచ్చి మోసపోయారు.
News February 19, 2025
మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార గోడపత్రికలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా, ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్ మేళాను వినియోగించుకోవాలని తెలిపారు.
News February 19, 2025
కామారెడ్డి: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:విద్యాశాఖ కమిషనర్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.